న్యూఇయర్ వేడుకలలో భాగంగా బెంగళూరు సిలికాన్ వ్యాలీలో యువతులపై అరాచకశక్తుల ముఠా జరిగిన బహిరంగా లైంగిక వేధింపుల ఘటనపై తాను చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక హోంమంత్రి జీ పరమేశ్వర వివరణ ఇచ్చారు. తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆయన ఇవాళ స్పందించారు. తాను అన్న మాటలను సందర్భోచితంగా తీసుకోకుండా కేవలం తాను ఘటనను తేలిగ్గా చేసి చూపానన్నది మాత్రం పెద్దగా చేసి చూపారని అయన అన్నారు. ఎందుకని ఈ వ్యాఖ్యలను తాను చేయాల్సి వచ్చిందో అలా కాకుండా మరో కోణంలో వాటిని తీసుకున్నారన్నారు.
'నేను దేనిని ఉద్దేశించి అన్నానో అలా నా మాటలు తీసుకోలేదు. ఆ రోజు జరిగింది ఓ దురుదృష్టకర సంఘటన. యువతులు కించపర్చాలన్నది నా అభిమతం కాదు. ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నా.. ఇది కేవలం బెంగళూరు సిటీకి ప్రతిష్టను దెబ్బతీసేందుకు జరుగుతున్న కుట్ర. నాకు జాతీయ మహిళా కమిషన్ సమన్లు పంపించింది ఇచ్చింది. వాటికి నేను వివరణ ఇస్తాను. అలాగే, గవర్నర్ ఈ ఘటనకు సంబంధించి నా నుంచి వివరణ కోరారు. దానికి కూడా నేను సమాధానం ఇస్తాను' అని ఆయన మీడియాకు బదులిచ్చారు.
నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా బెంగళూరులోని ఎంజీ రోడ్డులో మహిళలు, యువతులపై లైంగిక వేధింపులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై నాడు మంత్రిని వివరణ కోరగా ఆయన పోలీసులను వెనుకేసుకు రావడమే కాకుండా అక్కడి వచ్చిన యువత అంతా కూడా పాశ్చాత్య సంస్కృతిని అనుసరిస్తున్నవారని, వారిలాగే దుస్తులు వేసుకున్నవారని, ఇలాంటి సందర్భాల్లో అలాంటివి జరుగుతుంటాయని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసందే. దీనిపై జాతీయ మహిళ కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మరోపక్క, బెంగళూరులోని ఓ వీధిలో న్యూఇయర్ శుభాకాంక్షల పేరిట ఓ అమ్మాయిపై లైంగిక వేధింపులకు పాల్పడి సీసీటీవీ కెమెరాకు చిక్కిన ఘటనకు సంబంధించి పోలీసులు నలుగురు వ్యక్తుల్ని అరెస్టు చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more