మణిపూర్ లో రేగిన అందోళనలు, నిరసనల నేపథ్యంలో రాష్ట్ర రహదారులు నిర్భందం కోనసాగుతున్న తరుణంలో జనజీవనం పూర్తిగా స్థంభించింది. గత 50 రోజులుగా కొనసాగుతున్న ఆర్థిక కార్యకలాపాల దిగ్బంధనంతో ఇంఫాల్ కు వెళ్లే ట్రక్కులన్నీ జాతీయ రహదారులు 37, 2పై నిలిచిపోయాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు అర్మీని రంగంలోకి దించుతామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజ్జు కూడా ప్రకటించారు. పరిస్థితిని సాధ్యమైనంత త్వరగా సాధరణానికి తీసుకువస్తామని చెబుతున్నా అందోళన కారులు మాత్రం తమ బెట్టువీడటం లేదు.
అయితే అందోళనకు రాజకీయ రంగు పులుముకోవడం కారణంగానే నిరసన సెగలు ఇంకాస్త జఠిలంగా మారయన్న వార్తలు కుడా వినిపిస్తున్నాయి. కాగా యంగ్ మిజో అసోసియేషన్ అధ్వర్యంలో మిజోరంకు వెళ్లే రహదారులను అందళనకారులు నిలివివేయడంతో అక్కడి నిత్యావసరాలను రవాణా చేస్తున్న లారీలు కూడా నిలిచిపోయాయి. దీంతో అక్కడ నిత్యావసర ధరలకు మునుపెన్నడూ లేని ధరలు పలుకుతుంది. లీటర్ పాలు 60 నుంచి 70 రూపాయల ధర పలుకుతుండగా, కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలకు కూడా మూడునాలుగింతలుగా రెక్కలు వచ్చాయి. ఇక లీటర్ పెట్రోల్ రూ.300... గ్యాస్ సిలిండర్ రూ.3,000 ధర పలుకుతుంది.
నాగాలు, ఇతర వర్గాల మధ్య జాతి ఘర్షణలు ఈ ప్రాంతంలో ఎప్పటి నుంచో ఉన్నవే. ఈ రాష్ట్రంలో నాగాల జనాభా 20 శాతం కాగా, మీతీస్ 65 శాతంగా ఉన్నారు. కుకి చిన్ వర్గం జనాభా 13 శాతం. కొత్తగా ఇంఫాల్ తూర్పు జిల్లాలోని జిరిబామ్ ప్రాంతాన్ని, సేనాపతి జిల్లాలోని కంగ్ పోక్పి లను రెండు కొత్త జిల్లాలుగా చేయనున్నట్టు గత అక్టోబర్లో మణిపూర్ ప్రభుత్వం ప్రకటించింది. ఇది నాగాలకు రుచించలేదు. సేనాపతి జిల్లా తమ పూర్వీకుల స్వస్థలమని, దాన్ని విడగొట్టడానికి వీల్లేదంటూ వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ చర్యకు వ్యతిరేకంగా నవంబర్ 1న నాగా కౌన్సిల్ ఆర్థిక దిగ్బంధనానికి దిగింది.
అయినప్పటికీ ప్రభుత్వం దిగిరాలేదు. డిసెంబర్ 8న ఏడు కొత్త జిల్లాలను ప్రభుత్వం ప్రకటించేసింది. దీంతో ఇంఫాల్ వ్యాలీలో ఘర్షణలు తలెత్తాయి. ఫలితంగా ఈ నెల 18న కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. నాగాల దిగ్బంధనంతో మొత్తం ఏడు జిల్లాల్లో ప్రజా జీవనానికి తీవ్ర విఘాతం నెలకొంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సాయం కోరింది. అదనపు బలగాలను పంపాలని కోరింది. అయితే కేంద్రం కూడా కాస్త వేచిచూసే ధోరణినిన అవలంభిస్తుందన్న విమర్శలు వున్నాయి. గత పక్షం రోజులుగా అందోళనలు తీవ్రమైనా కేంద్రం ఎందుకు చర్యలకు ఉపక్రమించలేదన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కాగా ఈ ఆందోళన ప్రభావం పవిత్ర క్రిస్మస్ వేడుకలపైన కూడా పడే ప్రభావం వుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more