పెద్దనోట్ల రద్దు తరువాత ఏకంగా కోటి రూపాయల మేర తన బ్యాంకు అకౌంటులో వేయడంతో అదాయపన్ను శాఖ దృష్టి సారించి దాడులు చేపట్టడంతో ఏకంగా గుజరాత్ లోని ఒక చాయ్ వాలా కిషోర్ భజియావాలా వద్ద 650 కోట్ల రూపాయల విలువైన అస్తులు బయటపడ్డాయి. గత వారం రోజులుగా ఇతని అస్తుల వివరాలపై తనీఖీలు చేస్తున్న అదాయశాఖ అధికారులకు తవ్విన కోద్దీ అస్తులు బయటపడుతున్నాయి. దీంతో తొలుత వంద ఆ తరువాత నాలుగు వందలు, ప్రస్తుతం 650 కోట్ల రూపాయలకు పైగానే అతని వద్ద అస్తులున్నాయని అధికారులు కనుగోన్నారు.
అయితే ఈ ఆస్తులన్నింటినీ అతను కేవలం చాయ్ తో పాటుగా స్నాక్స్ అమ్ముతూనే సంపాదించానని, గత మూడు దశాబ్దాలుగా.. డైమండ్ సిటీగా పేరొందని సూరత్ నగరశివార్లలోని ఉద్నాలో ఛాయ్, స్నాక్స్ అమ్ముతూ కూడబెట్టుకున్నానని చెబుతున్నాడు. సుమారు దశబ్దమున్నర కాలం నుంచి టీ స్టాల్ తో పాటు ఫైనాన్స్ రంగంలోనూ అడుగుపెట్టిన కిషోర్ భజియావాలా రెండు చేతులా సంపాదిస్తున్నాడు. అయితే మాత్రం తన వద్దనున్న కోటి రూపాయల పాత నోట్లను ఏం చేయాలి..బ్యాంకులో వేస్తే తప్పేంటి..? అంతమాత్రాన అదాయశాఖ దాడులు చేస్తుందా..? అంటారా.?
ఇతగాడు చేసిన నేరమేమిటంటే.. రెండు చేతులా సంపాదిస్తున్నప్పుడు సక్రమంగా పన్నులు కడితే సరిపోయేది. అలా కాకుండా కక్కుర్తి పడి ఏడాదికి సుమారుగా 120 నుంచి 150 కోట్ల మేర వున్న తన అధాయాన్ని కేవలం కోటిన్నర రూపాయలుగా మాత్రమే చూపించడంతో అసలుకే ఎసరు వచ్చింది. అదాయ శాఖ అధికారుల దాడుల్లో ఏకంగా కోటాను కోట్ల రూపాయల అస్తులు బయటపడుతున్నాయి. ఇతడి వద్ద నుంచి 50 కిలోల వెండి, రూ. 1.39 కోట్ల విలువైన వజ్రాలు, రూ. 6.5 కోట్ల నగదు, కిలోల కొద్దీ బంగారాన్ని అధికారులు గుర్తించారు.
ఇవి చాలదన్నట్లు తనకు తన కుటుంబ సభ్యులకు చెందిన సుమారు 40 మేర బ్యాంకు అకౌంట్లు వున్నాయని, ఈ క్రమంలో రానున్న రోజుల్లో కిషోర్ భజియావాలా అస్తులు మరింత పెరగవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఈ వ్యాపారి టీ స్టాల్ తో పాటు ఫైన్సాన్స్ ల వద్ద బీజేపికి చెందిన రాష్ట్ర నాయకులతో పాటు కేంద్రమంత్రి ఫోటో, హిందూ విశ్వపరిషత్ నేతలతో దిగిన ఫోటోలు కూడా వున్నాయి. అయితే బీజేపీతో కిషోర్ కు మంచి సంబంధాలున్నాయని కూడా తెలుస్తుందని సమాచారం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more