ప్రభుత్వాలు ప్రారంభించే ఏ పథకాలకైనా సరే ప్రజా మద్ధతు, సహకారం ఉంటేనే అవి నూటికి నూరు పాళ్లు విజయాన్ని సాధిస్తాయి. అయితే స్వచ్ఛ భారత్ దిశగా అడుగులు వేసే క్రమంలో కేంద్ర ప్రభుత్వం తడబాటుకి గురవుతూనే ఉంది. దీంతో రంగంలోకి దిగిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఇకపై బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే పదివేల రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనల(2016) ప్రకారం చెత్తాచెదారాన్ని సేకరించి నిర్దేశిత ప్రాంతానికి తరలించే బాధ్యత అధికారులదేనని ట్రైబ్యునల్ తేల్చి చెప్పింది. మునిసిపల్ ఘన వ్యర్థాలు, చెత్తాచెదారం సమస్యలు ఢిల్లీలోనే అధికమని పేర్కొంది. చెత్తాచెదారం విషయంలో పకడ్బందీగా వ్యవహరిస్తే ప్రజారోగ్యానికి ఎటువంటి హానీ ఉండదని తెలిపింది. హోటళ్లు, రెస్టారెంట్లు, కూరగాయల మార్కెట్లు, వధశాలలు నిబంధనల మేరకు చెత్తాచెదారాన్ని తొలగించుకోవాలని పేర్కొంది.
తడి, పొడి చెత్తను ఎప్పటికప్పుడు వేరుచేసి తరలించాలని, అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ బహిరంగ ప్రదేశాల్లో చెత్తను పడేస్తే రూ.10వేలు జరిమానా కట్టాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేసింది. ఢిల్లీలో ఘన వ్యర్థాల నిర్వహణ తీరుపై దాఖలపై పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ స్వతంత్ర కుమార్ సారథ్యంలోని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఈ ఆదేశాలు జారీ చేసింది. మన ఆరోగ్యం గురించే కాదు.. ఇతరుల గురించి కూడా ఆలోచించాలి. చెత్త రహిత దేశంగా రూపొందించటంలో ప్రభుత్వాలకు సహకరించాలని ప్రజలకు బెంచ్ పిలుపునిచ్చింది.
అయితే జీహెచ్ఎంసీ గతంలోనే ఇలాంటి నిబంధనను తెచ్చినప్పటికీ, అది విజయవంతం కాకపోవటం ఇక్కడ చెప్పుకోదగిన విషయం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more