దేశీయ విమానయానం చేయాలా.. మీ వేలి ముద్రలు వుంటూ చాలు.. అంటోంది కేంద్ర విమానయాన శాఖ. అంటే విమానాశ్రయంలోకి వెళ్లడానికి మీ వ్యక్తిగత గుర్తింపు కార్డు, ఇతర పత్రాలు తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా విమానయాణాన్ని అందించనున్నారు. త్వరలో అందుబాటులోకి రానున్న బయోమెట్రిక్ విధానంలో కేవలం మీ వేలిముద్ర చాలట. అయితే ఇదంతా కేంద్ర ప్రభుత్వం అనుకున్నది అనుకున్నట్లే జరిగితే సుమా. వినడటానికి ఇదంతా ఏదో వింతలా అనిపించొచ్చు గానీ.. పౌర విమానయాన మంత్రిత్వశాఖ ఇప్పటికే ఈ దిశగా కసరత్తులు మొదలుపెట్టేసింది. అందులోనూ హైదరాబాద్లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇప్పటికే టెర్మినల్ వద్దకు వెళ్లడానికి బయోమెట్రిక్ గుర్తింపు పద్ధతిని పైలట్ ప్రాజెక్టుగా విజయవంతంగా అమలుచేస్తున్నారు.
ఇప్పటి వరకు దేశంలో 100 కోట్ల మందికి ఆధార్ కార్డులు జారీ అయ్యాయని, ఆ కార్డులు ఇచ్చేటపుడు అన్ని వేళ్ల ముద్రలు, ఐరిస్ స్కాన్ చేసి వాటిని జాతీయ డిజిటల్ రిజిస్ట్రీలో ఫీడ్ చేశారని పౌర విమానయాన మంత్రిత్వశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం విమానాశ్రయంలో టెర్మినల్ వద్దకు వెళ్లాలంటే తమ టికెట్తో పాటు గుర్తింపు కార్డు కూడా చూపించాలని, కానీ ఇప్పుడు టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే ఆధార్ నంబర్లు అడుగుతున్నామని చెప్పారు.
విమానాశ్రయంలో వేలి ముద్ర వేస్తే ఆధార్ వివరాలు తెలుస్తాయని, టికెట్ మీద ఉన్నది.. అది రెండూ మ్యాచ్ అయితే టెర్మినల్ వద్దకు వెళ్లడం, స్వదేశీ విమానాలు ఎక్కడానికి కూడా అనుమతించొచ్చని ఆయన వివరించారు. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) పర్యవేక్షణలో హైదరాబాద్ విమానాశ్రయంలో ఈ పైలట్ ప్రాజెక్టును అమలు చేస్తున్నట్లు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ గురుప్రసాద్ మొహాపాత్ర చెప్పారు. త్వరలోనే ఢిల్లీ, ముంబై, బెంగళూరు విమానాశ్రయాల్లో కూడా అమలు చేస్తామని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more