కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వంపై మరోమారు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ ఫీలాసఫీకి చెందిన విద్యార్థి.. అంబేద్కర్ విద్యార్థి సంఘం నేత రోహిత్ వేముల అత్మహత్య అంశంపై ఆయన బీజేపి ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. విద్యార్థుల విమర్శలను కూడా కేంద్రంలోని బీజేపి ప్రభుత్వం అంత సీరియస్ గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరముందా..? అని ప్రశ్నించారు. విద్యార్థి వ్యతిరేకతను వ్యక్తిగతంగా తీసుకోవడంతోనే రోహిత్ వేముల ఆత్మహత్యకు కారణమయ్యిందని పవన్ అరోపించారు.
దేశంలోని ఎంతో మంది వ్యతిరేకించినట్లుగానే రోహిత్ వేముల కూడా బీజేపి పార్టీని, పార్టీ విధానాలన్ని వ్యతిరేకించారు. అయితే ఆయన తన ఊహాజనితమైన సామ్యవాద సమాజం నుంచి బయటకు తీసుకువచ్చేందుకు మానవీయ కోణంలో అలోచించే ఓ విద్యార్థి కౌన్సిలర్ ను అతని చెంతకు పంపితే బాగుండేదని, అలా కేంద్రప్రభుత్వం వ్యవహరించి వుండి వుండి దేశానికి ఒక ఫిలాసఫీలో ఎంఫిల్ చేసిన ఓ నిపుణుడు సేవలందించేవాడని పవన్ అభిప్రాయపడ్డారు.
రోహిత్ వేముల ఆత్మహత్య కు పాల్పడటానికి కేంద్రం కారణమని అరోపించిన ఆయన విశ్వవిద్యాలయం నుంచి వెళ్లిపోమ్మని చెప్పడం, అంతకు ముదుగానే అతడ్ని తరగతుల నుంచి సస్పెండ్ చేయడం కూడా కారణాలుగా మారాయన్నారు. ఇక విశ్వవిద్యాలయ యాజమాన్య చర్యలతో మానసికంగా అందోళనకు గురైన రోహిత్ వేములకు తన వర్గానికి చెందిన వారి నుంచే మద్దతు లభించకపోవడం ఆయన మానసిక పరిస్థితిని మరింత దిగజార్చిందని పవన్ అన్నారు. దీంతోనే అయన ఆత్మహత్యకు పాల్పడ్డారని అన్నారు.
రోహిత్ వేముల ప్రజాస్వామ్య యుతంగానే బీజేపిపై తన వైఖరిని వ్యక్తపర్చినా దానిని నెపంగా తీసుకుని అతన్ని వేధించేందుకు మాత్రం ప్రభుత్వాలకు ఎవరూ లైసెన్సులు ఇవ్వలేదని పవన్ అన్నారు. విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘాల మధ్య చోటుచేసుకునే ఘటనను కేంద్రం పెద్ద మనస్సులో మారుతున్న విద్యార్థి లోకం ఐడియాలజీగా పరిగణించేందుకు బదులు పగబట్టి మరీ వేధించే చర్యలను పూనుకోవడం అసమంసమని అన్నారు. విద్యార్థి సంఘాలు యూనివర్సిటీలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించి సందర్బంలో తీసుకోవాల్సిన క్రమశిక్షణా చర్యలు.. ముందుగానే తీసుకోవడం కూడా రోహిత్ వేముల మరణానానికి కారణంగా పవన్ అభిప్రాయపడ్డారు.
రోహిత్ అత్మహత్య ఘటనపై బీజేపి వ్యతిరేక పార్టీలన్నీ తమ మైలేజీ కోసం పాకులాడుతుంటే.. బీజేపి మాత్రం అసలు రోహిత్ వేముల దళితుడా కాదా..? అన్న అంశాన్ని తేల్చడంలో తలమునకలై విమర్శలు ప్రతివిమర్శలలో మునిగాయే తప్ప.. బంగారు భవిష్యత్తు వున్న యువమేధావులను ఎలా పరిరక్షించుకోవాలన్న అలోచనను మాత్రం ఏ పార్టీలు చేయలేదని పవన్ ధ్వజమెత్తారు. ఏదో ఒక రోజు దేశంలోని విశ్వవిద్యాలయాలన్నీ ప్రస్తుతం కనిపించే విధంగా రాజకీయపార్టీలకు యుద్ద క్షేత్రాలుగా కాకుండా విజ్ఞాన బాండాగారాలుగా మారుతాయని, అ రోజు కోసం వేచి చూద్దామని అన్నారు.
— Pawan Kalyan (@PawanKalyan) December 16, 2016
— Pawan Kalyan (@PawanKalyan) December 16, 2016
— Pawan Kalyan (@PawanKalyan) December 16, 2016
— Pawan Kalyan (@PawanKalyan) December 16, 2016
— Pawan Kalyan (@PawanKalyan) December 16, 2016
— Pawan Kalyan (@PawanKalyan) December 16, 2016
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more