గత సార్వత్రిక ఎన్నికలో బేషరుత్తు మద్దుతు ఇచ్చి.. తన శక్తి మేరకు కేంద్రంలో బీజేపి ప్రభుత్వం వచ్చేందుకు శ్రమించి, ప్రచారం చేసిన జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ఎన్నికల హామీలలో భాగంగా రాష్ట్రానికి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదాకు కేంద్రం తిలోదకాలు ఇవ్వడంతో.. ఇప్పుడా పార్టీతో పూర్తిగా తెగదెంపులు చేసుకునేందుకు రంగం సిద్దం చేసుకున్నట్లు కనబడుతుంది. ఇటీవల నిర్వహించిన తిరుపతి సభలో బీజేపీతో పోత్తు పెట్టుకోనని తెగేసి చెప్పిన పవన్.. ఇక ఆ పార్టీపై విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టారు.
సోషల్ మీడియా అనుసంధానమైన ట్విట్టర్ వేదికగా ఆయన బీజేపిపై తీవ్రంగా మండిపడ్డారు. గోవధ అంశంపై చిత్తశుద్ధి ఉంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బీఫ్ను ఎందుకు నిషేధించలేదని జనసేనాని ప్రశ్నించారు. బీజేపికి నిజంగా దమ్ముంటే గోవాలో గోవధ నిషేధాన్ని అమలు పర్చవచ్చు కాదా..? అని ప్రశ్నించారు. దీంతో గో మాంసం తీనేవారికి..గోవును దైవ్యంగా అరాధించే వారికి మధ్య ప్రభుత్వమే చిచ్చుపెడుతున్నట్లు వుందని ఆయన అందోళన వ్యక్తం చేశారు.
బీజేపీ గోవధపై నానాయాగీ చేయకుండా వాళ్ల పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులను, అన్ని రాష్ట్రాల శాసనసభ్యులను లెదర్ బూట్లు, బెల్టులు వాడకూడదని అదేశాలు జారీ చేయవచ్చు కదా అని అయన ప్రశ్నించారు. ఇక గోవుపై అంత ప్రేమ కనబర్చే గో సంరక్షణ సమితీలు తమ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యులు, నాయకులు, కార్యకర్తలను గోవులను దత్తత తీసుకోవాలని అదేశాలను జారీ చేసి వుండవచ్చు కదా అని ఆయన ప్రశ్నించారు.
గోవధ జరిగిపోతుందంటూ నానా హైరానా చేసి, అమాయకులపై దాడులు జరిపి.. వారిచేత గోపంచకాన్ని తాగించడం, లాంటి హేయకరమైన చర్యలకు పాల్పడటం కంటే ఇలాంటి మార్గాల ద్వారా గోవధను అరికట్టవచ్చుకదా అని అయన సూచించారు. ఇప్పటికే పలుమార్లు బహిరంగ సభల్లో తీవ్ర విమర్శలు గుప్పించిన పవన్ బీజేపీపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. గోవధ, రోహిత్ వేముల, దేశభక్తి, నోట్ల రద్దు, ఏపీకి ప్రత్యేక హోదా సహా ఐదు అంశాలపై ప్రశ్నించనున్నట్లు పవన్ ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు.
ఇకపై రోజుకో అంశంపై స్పందిస్తానని పవన్ స్పష్టం చేశారు. శుక్రవారం రోజున రోహిత్ వేముల అంశంపై స్పందిస్తానని ట్విట్టర్లో జనసేన అధినేత పవన్ వెల్లడించారు. దీంతో పవన్ అభిమానుల్లో, పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం రెట్టింపయ్యింది. ప్రశ్నిస్తానని పార్టీ పెట్టిన పవన్ ఆ పని చేయట్లేదన్న విమర్శలకు చెక్ పెట్టినట్లయింది. ఇప్పుడు పవన్ అసలు రూట్లోకి వచ్చారని రాజకీయ నిపుణులు చెప్పుకుంటున్నారు.
— Pawan Kalyan (@PawanKalyan) December 15, 2016
— Pawan Kalyan (@PawanKalyan) December 15, 2016
— Pawan Kalyan (@PawanKalyan) December 15, 2016
— Pawan Kalyan (@PawanKalyan) December 15, 2016
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more