ఒక ఊహాజనిత చిత్రం.. బహుశా మన దేశంలో మాత్రం ఇలాంటి అరుదైన ఘటనలు ఎప్పుడు చోటుచేసుకోకపోవచ్చు. కానీ అలాంటిదే జరిగితే.. ఎలా వుంటుందన్న ఉద్దేశ్యంతోనో.. లేక తాంబూలాలిచ్చాం.. తన్నుకు చావండీ అంటూ మా నిర్ణయం మేము తీసుకున్నాం.. ఇక కష్టాలు పడండీ అంటూ కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగానో మొత్తానికి ఒక ఫోటో మాత్రం సంచలనంగా మారుతుంది. ఈ ఫోటోకు క్యాషన్లు పెట్టడంలో ఇప్పుడు నెట్ జనులు ఫుల్ జబిజీగా వున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేక డబ్బు కోసం ఎంతలా ప్రజలు బాధపడుతున్నారో ఈ ఫోటోతో అర్థం అవుతుంది. ఇంతకీ ఆ ఫోటో ఏంటీ అంటారా..?
పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో దేశంలోని సామాన్యులు ఎదుర్కోంటున్న పరిస్థితులు దేశంలోని బడా రాజకీయ వేత్తలకు ఎదురైతే.. ఎలా వుంటుంది. డబ్బులు డ్రా చేసుకోడానికి వారు గంటల తరబడి బ్యాంకుల ముందు క్యూ కడుతూ కనిపిస్తే.. ఎలా వుంటుంది..? వారికి ప్రజల అవస్థలు అర్థమైతే బాగుండు అనుకున్నవారెవరో ఈ ఆలోచనే చేశారు. దానిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. అంతే అది కాస్తా వైరల్ గా మారింది. ఎందుకలా అంటే.. దానికి కారణం లేకపోలేదు. తమ మదిలో వున్న అభిప్రాయాలను ఆ ఫోటోలపై పెట్టి మరీ నెట్ జనులు మళ్లీ మళ్లీ పోస్ట్ చేస్తున్నారట. దీంతో ఆ నలుగురు ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెడింగ్ అవుతుంది.
ఇంతకీ ‘‘ఆ నలుగురు’’ ఎవరు..? ఏమా కథ అంటారా..? నెటిజన్లు. సృష్టించిన ఫోటోలో మొదట ప్రధానమంత్రి నరేంద్రమోడీ బ్యాంకు ఎదుట క్యూ లైన్లో నిలబడి వున్నారు. ఆయన వెనుకే మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, ఆ తరువాత బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ, అ తరువాత కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి అరుణ్ జైట్లీ ఉన్నారు. అయితే ప్రధానితో పాటు మన్మోహన్ సింగ్, అద్వానీ కూడా కళ్లజోడు పెట్టుకొని తాము సాధారణంగా ప్రజలకు కనిపించే గెటప్లోనే బ్యాంకు క్యూ ముందు నిలబడ్డారు. మోదీ ఈ కల్పిత ఫొటోలో సీరియస్గా కనిపిస్తుండగా, మిగతా వారు డబ్బుల కోసం క్యూ కట్టి కష్టపడిపోయినట్లు కనిపిస్తున్నారు.
దీంతో ప్రధాని ముందు నిల్చున్న వ్యక్తి ఏటీయం కేంద్రంలోకి వెళ్లి వెళ్లగానే తన జేడులో వున్న బ్యాంకు డెబిట్ కార్డులు వరుస క్రమంలో తీసి.. ఒక్కో దాని నుంచి డబ్బులు డ్రా చేస్తున్నారని, దీంతో తమ వరకు డబ్బులు వుంటాయా..? లేక మొత్తం అతనితోనే అయిపోతాయా..? అన్నది అర్థంకాక ప్రధాని నరేంద్రమోడీ తన ముఖాన్ని సిరియస్ గా పెట్టారంటూ.. నెట్ జనులు ఎవరికి తోచిన విధంగా వారు జోకులు వేసుకుని మరీ ఆ ఫోటోలను అప్ లోడ్ చేస్తున్నారు. దీంతో ఈ ఫోటో కాస్తా హ్యూమరస్ గా మారి నెట్ లో చక్కర్లు కొడుతుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more