పాత పెద్ద నోట్లను రద్దు చేసిన తరువాత ఈ అంశాన్ని పార్లమెంటులో చర్చించాలని తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో వుందని, అందుకనే వారం రోజులు కూడా తిరక్కుండానే తాము పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేశామని, అయితే పార్లమెంటులో విపక్షాలు చర్చను జరగనీయకుండా చేస్తున్నాయని దాంతో తాను ప్రజల్లోకి వచ్చి జన సభల్లో మాట్లాడుతున్నానని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఈ సందర్భంగా పార్లమెంటు ఉభయ సభలు నోట్ల రద్దు అంశంపై ప్రతిరోజు స్థంభింపజేస్తున్న ప్రతిపక్షాలపై మండిపడిన అయన అది పాత ముచ్చటేనని, తాను తీసుకున్న నిర్ణయానికి జనామోదం వుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
అవినీతి రహిత భారతావని కోసం తాను తీసుకున్న నిర్ణయాలను నేరుగా ప్రజల్లోకి వెళ్లి వెల్లడిస్తున్నానన్నారు. పేదల వికాసం కోసమే పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. అవినీతికి వ్యతిరేకంగా, నల్ల డబ్బు వ్యతిరేకంగా, నకిలీ కరెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నట్టు మోదీ చెప్పారు. గుజరాత్లో బనస్కాంత జిల్లా పరిధిలోని దీసాలో జరిగిన ఓ రైతుసభలో మోదీ పెద్ద నోట్ల రద్దును పూర్తిగా సమర్థించుకన్నారు. దేశాన్ని పట్టిపీడిస్తోన్న నల్లధనాన్ని నియంత్రించడానికే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
ప్రజలు బ్యాంకులు, ఏటీఎంల ముందు నిలబడి రైతులు, సామాన్యులు తమ సమయాన్ని వృథా చేసుకోవాల్సిన అవసరం లేదని, బ్యాంకర్లు ఈ-వ్యాలెట్ల ద్వారా బ్యాంకులనే మీ మొబైల్ ఫోన్లలోకి తీసుకొచ్చారని చెప్పారు. వాటిని ఉపయోగించుకుంటూ నగదురహిత లావాదేవీలు జరపాలని పిలుపునిచ్చారు. అయితే ప్రజల తక్షణ అవసరాల కోసం మాత్రం రూ.100నోట్లను సరఫరాను పెంచామని ప్రధాని చెప్పారు. ఇక నల్లధనం దాచుకున్న అక్రమార్కులు ఒక్కరు కూడా తప్పించుకోవడానికి వీల్లేదని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక రైతుల జీవితాల్లో మార్పులు తీసుకొచ్చామని అన్నారు.
ఈ నిర్ణయంతో అటు దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు కూడా తగ్గుముఖం పట్టాయని, ఇటు దేశ అంతర్గ భద్రతకు సవాలుగా పరిణమించిన మావోయిస్టులు కూడా దిక్కుతోచని పరిస్థిత్లో వున్నారని మోడీ అన్నారు. నల్లధనంపై పోరులో 50 రోజులు గడువు అడిగాం.. ఇపుడు ఎలాంటి మార్పులు వస్తున్నాయో మీరు చూస్తున్నారని మోదీ చెప్పారు. నకిలీ కరెన్సీని, అవినీతిని దేశం ఎట్టి పరిస్తితుల్లోనూ సహించదు. ఈ విషయంలో ప్రజల అశీర్వాదాలు కావాలంటూ ప్రజలనుద్దేశించి మోదీ కోరారు. ఇపుడు ప్రజల శక్తి బలం పెరుగుతోందని ప్రధాని అకాంక్షించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more