ప్రేమ పేరుతో గర్భవతిని చేసి వంచించాడని.. Spurned lover sets man ablaze at lodge

Spurned lover sets man ablaze at lodge

Spurned lover, Victoria Hospital, mansoor moosa, kuvempunagar, mysuru, shruthi, cottonpet police, majestic, Bengaluru, mysuru railway station, kerala, crime news

A 21-year-old shop attendant has allegedly set her lover ablaze inside a lodge at Cottonpet, Majestic, west Bengaluru. The accused, K Shruthi plotted the murder after Mansoor Moosa, 27, a tea vendor at Mysuru railway station, refused to marry her

ప్రేమ పేరుతో గర్భవతిని చేసి వంచించాడని..

Posted: 12/08/2016 11:58 AM IST
Spurned lover sets man ablaze at lodge

ప్రేమ పేరుతో ఒక్కటయ్యాయి రెండు హృదయాలు.. రెండు శరీరాలు ఒక్క మనస్సు అన్నట్లుగా మారారు. ఒకరంటే ఒకరు విడిచి లేనంతగా దెగ్గరయ్యారు. అతడిపై నమ్మకం శిఖరాగ్రానికి చేరింది. ఈ క్రమంలో అమె గర్భం దాల్చింది. అప్పటి నుంచి ప్రియుడి ప్రవర్తనలో మార్పు వచ్చింది. అమెను పెళ్లి చేసుకునేందుకు విముఖత వ్యక్తం చేశాడు. అంతేకాదు.. గర్భాన్ని తొలగించుకోవాలని అదేశఇంచాడు. అంతే అప్పటివరకు అతని ప్రేమలో కరిగిన అమె.. ఆగ్రహంతో రగలిపోయింది. తన ప్రియుడ్ని అంతం చేసే వరకు అమెలోని ప్రతీకారం చల్లారలేదు.

ఎలా హతమార్చిందంటారా..? కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరం మెజిస్టీ పరిధిలోని కాటన్ పేట్ ప్రాంతంలో గల ఓ లాడ్జిలో గదిని తీసుకుంది. నవంబర్ 27న ప్రియుడితో కలసి అక్కడకు చేరుకుంది. అ రోజు ఉల్లాసంగా గడిపారు. మరుసటి రోజు 28న కూడా సరదాగా గడిపింది. ఇక రాత్రి అతడికి నిద్రమాత్రలు కలపిన బోజనాన్ని వడ్డించింది. అమె వడ్డించిన బోజనాన్ని తిన్న ప్రియుడు నిద్ర మత్తులోకి జారుకున్నాడు. అంతే అతనిపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. మన్సూర్ మంటల్లో కాలి బూడిదయ్యాడు. లాడ్జీ గదిలో మంటలు వ్యాపించడంతో పారిపోయేందుకు యత్నించింది.

మంటలు వ్యాపించడంతో గమనించిన లాడ్జీ సిబ్బంది శ్రతిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే అమె తనపై అనుమానం రాకుండా వుండేందుకు కొన్ని నిద్రమాత్రలు మింగింది. దీంతో అమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించిన పోలీసులు.. అదుపులోకి తీసుకొని విచారించగా, అసలు విషయం వెలుగుచూసింది.

వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా వికసించిందంటే..

కేరళ రాష్ట్రానికి చెందిన మన్సూర్ (27) బెంగళూరుకు వలస వచ్చి సిటీ రైల్వేస్టేషన్ లోని ఏడో నెంబరు ఫ్లాట్ ఫామ్ పై టీ స్టాల్ నడిపేవాడు. మైసూర్ నగరానికి చెందిన శ్రుతి (21) అనే యువతి జలహళ్లి ప్రాంతంలో పేయింగ్ గెస్టుగా ఉంటూ మెడికల్ కళాశాలలో పారామెడికల్ కోర్సు చేస్తోంది. అయితే ప్రతీవారం అమె క్రమం తప్పకుండా తన స్వస్థలానికి వెళ్లి దివ్యాంగురాలైన తల్లిని చూసి వచ్చేంది. ఇలా వెళ్లే ప్రతీ సారి బెంగళూరు రైల్వే స్టేష్టన్ లో టీ అమ్ముకునే మన్సూర్ వద్ద టీ తాగేది. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం క్రమంగా స్నేహంగా మారింది.

అది కాస్తా ప్రేమగా వృద్ది చెందింది. దీంతో ఆమె గర్భవతి అయింది. తనను పెళ్లి చేసుకోవాలని శ్రుతి మన్సూర్ ని కోరగా అందుకు ఆయన నిరాకరించాడు. అంతేకాదు అబార్షన్ చేయించుకోమని ఉచిత సలహా కూడా ఇచ్చాడు. దీంతో ఆగ్రహించిన శ్రుతి.. స్థానికంగా గల శ్రీకృష్ణా లాడ్జీలో గది తీసుకొని అక్కడకు మన్సూర్ ను తీసుకువెళ్లి.. నిద్రమాత్రలు కలిసిన బోజనాన్ని పెట్టి అనంతరం కిరోసిన్ పోసి నిప్పంటించింది. కేసు నమోదు చేసిన పోలీసులు శ్రుతిని అరెస్టు చేసి జుడీషియల్ రిమాండుకు తరలించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Spurned lover  Victoria Hospital  mansoor moosa  kuvempunagar  mysuru  shruthi  cottonpet police  crime news  

Other Articles