ప్రేమ పేరుతో ఒక్కటయ్యాయి రెండు హృదయాలు.. రెండు శరీరాలు ఒక్క మనస్సు అన్నట్లుగా మారారు. ఒకరంటే ఒకరు విడిచి లేనంతగా దెగ్గరయ్యారు. అతడిపై నమ్మకం శిఖరాగ్రానికి చేరింది. ఈ క్రమంలో అమె గర్భం దాల్చింది. అప్పటి నుంచి ప్రియుడి ప్రవర్తనలో మార్పు వచ్చింది. అమెను పెళ్లి చేసుకునేందుకు విముఖత వ్యక్తం చేశాడు. అంతేకాదు.. గర్భాన్ని తొలగించుకోవాలని అదేశఇంచాడు. అంతే అప్పటివరకు అతని ప్రేమలో కరిగిన అమె.. ఆగ్రహంతో రగలిపోయింది. తన ప్రియుడ్ని అంతం చేసే వరకు అమెలోని ప్రతీకారం చల్లారలేదు.
ఎలా హతమార్చిందంటారా..? కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరం మెజిస్టీ పరిధిలోని కాటన్ పేట్ ప్రాంతంలో గల ఓ లాడ్జిలో గదిని తీసుకుంది. నవంబర్ 27న ప్రియుడితో కలసి అక్కడకు చేరుకుంది. అ రోజు ఉల్లాసంగా గడిపారు. మరుసటి రోజు 28న కూడా సరదాగా గడిపింది. ఇక రాత్రి అతడికి నిద్రమాత్రలు కలపిన బోజనాన్ని వడ్డించింది. అమె వడ్డించిన బోజనాన్ని తిన్న ప్రియుడు నిద్ర మత్తులోకి జారుకున్నాడు. అంతే అతనిపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. మన్సూర్ మంటల్లో కాలి బూడిదయ్యాడు. లాడ్జీ గదిలో మంటలు వ్యాపించడంతో పారిపోయేందుకు యత్నించింది.
మంటలు వ్యాపించడంతో గమనించిన లాడ్జీ సిబ్బంది శ్రతిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే అమె తనపై అనుమానం రాకుండా వుండేందుకు కొన్ని నిద్రమాత్రలు మింగింది. దీంతో అమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించిన పోలీసులు.. అదుపులోకి తీసుకొని విచారించగా, అసలు విషయం వెలుగుచూసింది.
వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా వికసించిందంటే..
కేరళ రాష్ట్రానికి చెందిన మన్సూర్ (27) బెంగళూరుకు వలస వచ్చి సిటీ రైల్వేస్టేషన్ లోని ఏడో నెంబరు ఫ్లాట్ ఫామ్ పై టీ స్టాల్ నడిపేవాడు. మైసూర్ నగరానికి చెందిన శ్రుతి (21) అనే యువతి జలహళ్లి ప్రాంతంలో పేయింగ్ గెస్టుగా ఉంటూ మెడికల్ కళాశాలలో పారామెడికల్ కోర్సు చేస్తోంది. అయితే ప్రతీవారం అమె క్రమం తప్పకుండా తన స్వస్థలానికి వెళ్లి దివ్యాంగురాలైన తల్లిని చూసి వచ్చేంది. ఇలా వెళ్లే ప్రతీ సారి బెంగళూరు రైల్వే స్టేష్టన్ లో టీ అమ్ముకునే మన్సూర్ వద్ద టీ తాగేది. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం క్రమంగా స్నేహంగా మారింది.
అది కాస్తా ప్రేమగా వృద్ది చెందింది. దీంతో ఆమె గర్భవతి అయింది. తనను పెళ్లి చేసుకోవాలని శ్రుతి మన్సూర్ ని కోరగా అందుకు ఆయన నిరాకరించాడు. అంతేకాదు అబార్షన్ చేయించుకోమని ఉచిత సలహా కూడా ఇచ్చాడు. దీంతో ఆగ్రహించిన శ్రుతి.. స్థానికంగా గల శ్రీకృష్ణా లాడ్జీలో గది తీసుకొని అక్కడకు మన్సూర్ ను తీసుకువెళ్లి.. నిద్రమాత్రలు కలిసిన బోజనాన్ని పెట్టి అనంతరం కిరోసిన్ పోసి నిప్పంటించింది. కేసు నమోదు చేసిన పోలీసులు శ్రుతిని అరెస్టు చేసి జుడీషియల్ రిమాండుకు తరలించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more