బీజేపి ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు చేస్తూ తీసుకున్న చారిత్రక నిర్ణయంతో దేశంలోని అనేక మంది ప్రజలు డబ్బుల కోసం ఈ నెల 10 నుంచి నేటి వరకు వెంపర్లాడుతూనే వున్నారు. ఏటియంలలో డబ్బులు లేని మిషన్లు వెక్కిరిస్తూ కనబడటం.. ఇక బ్యాంకుల పెద్ద క్యూలలో నిల్చోని డబ్బులు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఈ నిర్ణయం ముందుగానే తెలిసి జాగ్రత్త పడ్డారో.. లేక బ్యాంకు పోరబాటో తెలియదు కానీ మొత్తానికి పంజాబ్ లోని ఓ టాక్సీ డ్రైవర్ ను మాత్రం ఏక్ దిన్ కా సుల్తాన్ గా మార్చేసింది. ఆ విషయం మాకు తెలుసు అంటున్నారా..? అక్కడికే వస్తున్నాం..
పంజాబ్లోని బర్నాలతో ప్రాంతంలో నివసించే టాక్సీ డ్రైవర్ బల్వీందర్ సింగ్..గుర్తున్నాడు కదూ.. అయనే నండి ఒక్క రోజులో 9వేల 8 వందల కోట్ల రూపాయలకు అధిపతిగా మారి.. మరుసటి రోజున మళ్లీ యధావిధిగా టాక్సీ డ్రైవర్ గా మిగిలాడు. అయితే తన అకౌంట్ లో ఇంత డబ్బు వుందని చూసుకుని మురిసే లోపు ఆయనకు తెలియకుండానే ఆ డబ్బంతా కనుమరుగైంది. ఇది ఈనెల 4న జరిగిన ఘటన. ఈ ఘటన మిగిల్చని అనుభూతితో ఇంకా షాల్ లోనే వున్న బల్విందర్ కు అలాంటిదే మరో ఘటన ఎదురైంది.
అయితే, తాజాగా ఆయన అకౌంట్లోకి మరో రూ.999 కోట్లు వచ్చిపడ్డాయి. అదెలా జరుగుతుంది. ఈ నెల 4న జరిగిన తప్పిదాన్ని బ్యాంకు అధికారులు సమరించిన పిమ్మట కూడా అదే తరహాలో మళ్లీ తప్పు దోర్లడం.. అదెలా సాధ్యం అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. అసలు జరిగిందేంటంటారా.. ఈ నెల 19న తన బ్యాంకు ఖాతాలో రూ.167 డిపాజిట్ అయినట్లు ఆయన మెసేజ్ అందుకున్నాడు.
అనంతరం తన బ్యాంక్ బ్యాలన్స్ తెలుపుతూ మరో మెసేజ్ కూడా అందుకున్నాడు. దీంతో మరోసారి షాక్ కి గురయ్యాడు. ఈ సారి ఆయన ఖాతాలో రూ.999 కోట్లు ఉన్నట్లు తెలుసుకొని బ్యాంకు సిబ్బంది దృష్టికి తీసుకెళ్లగా ఈసారి కూడా పొరపాటే జరిగిందని చెప్పారు. సాంకేతిక కారణాలతో పదే పదే ఆయన ఖాతాలో కోట్ల కొద్దీ డబ్బు పడుతుండడంతో తాత్కాలికంగా అతని బ్యాంక్ ఖాతాను మూసివేస్తున్నట్లు బ్యాంకు అధికారులు చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more