రెక్కాడితే కానీ డోక్కాడని కష్టజీవి.. బీజేపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకంలో భాగంగా ఆయన స్టేట్బ్యాంక్ ఆఫ్ పాటియాలాలో అతడికి ప్రధానమంత్రి జనధన యోజన కింద ఒక అకౌంటు తెరిచాడు. అవసరానికి ఉపయోగపడతాయని తన ఖాతాలో సుమారు మూడు వేల రూపాయలను దాచుకున్నాడు. ఈ నెల 4న బ్యాంకు నుంచి ఆయనకు ఒక బ్యాంకు నుంచి ఎస్ఎంఎస్ వచ్చింది. తన ఖాతాలో ఏకంగా 98,05,95,12,231.00 డబ్బు జమైందని దాని సారంశం. ఏంటీ విచిత్రం.. అని తనలో తాను సంబ్రమాశ్చారానికి లోనైన సదరు టాక్సీ డ్రైవర్ కు ఇంకా నమ్మశక్యం కాలేదు. ఇలోగా తన సంతోషం హరించుకుపోయింది. దీంతో బ్యాంకు చుట్టూ తిరిగిన అతన్ని బ్యాంకు అధికారులు షాకుల మీద షాకులిచ్చారు.
వివరాల్లోకి వెళ్తే.. టాక్సీ డ్రైవర్ బల్వీందర్ సింగ్.. పంజాబ్లోని బర్నాలతో ప్రాంతంలో నివసిస్తూ.. స్థానికంగా టాక్సీ నడిపిస్తూ జీవనం సాగిస్తుంటాడు. ఈనెల 4న ఉన్నట్టుండి అతడి ఖాతాలోకి దాదాపు 9806 కోట్ల రూపాయలు వచ్చి పడ్డాయి. తన సెల్ఫోనుకు వచ్చిన ఎస్ఎంఎస్ను పదే పదే చూసుకుని నమ్మలేని అతని, సంభ్రమాశ్చార్యానికి గురయ్యాడు. కాగా, ఎలా వచ్చిన సోమ్ము అలా పోతుంది అని పెద్దలు అన్నట్లుగా.. ఆ మొత్తం డబ్బంతా మర్నాడే ఖాతాలోంచి వెళ్లిపోయింది.
దీంతో బ్యాంకు వద్దకు వెళ్లి అరా తీసిన అతనికి బ్యాంకు అధికారులు షాక్ ఇచ్చారు. ఈ నెల 7న బ్యాంకుకు వెళ్లి అధికారులను వాకాబు చేయగా, తన పాత పాస్ బుక్ తీసుకుని కొత్త పాస్ బుక్ అతని చేతికిచ్చారు. అయితే అందులో ఈ 9806 కోట్ల రూపాయలకు సంబంధించిన ఎంట్రీ లేదని బల్వీందర్ చెప్పాడు. సాధారణంగా అయితే తన అకౌంటులో 3వేల రూపాయలు ఉంటుందని, ఆ మొత్తం తనది కానే కాదని స్పష్టం చేశాడు. దీనిపై బ్యాంకు మేనేజర్ రవీందర్ కుమార్ను వివరణ ఇచ్చేందుకు నిరాకరించారు.
లీడ్ బ్యాంకు మేనేజర్ సందీప్ గార్గ్ మాత్రం దీనిపై వివరణ ఇచ్చారు. అతడి అకౌంటులోకి రూ. 200 క్రెడిట్ ఎంట్రీ చేసేటప్పుడు ఒక అసిస్టెంట్ మేనేజర్ పొరపాటున బ్యాంకుకు చెందిన 11 అంకెల ఇంటర్నల్ బ్యాంకింగ్ జనరల్ లెడ్జర్ అకౌంటు నంబర్ కూడా వేసేశారని, అందువల్ల ఆ మొత్తం వచ్చినట్లు కనిపించిందని చెప్పారు. మర్నాడు ఈ తప్పును తెలుసుకుని మళ్లీ సరిచేశామని వివరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more