పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విధించిన విత్ డ్రా పరిమితులు, నగదు మార్పిడి పరిమితులతో దేశవ్యాప్తంగా అనేక మంది ప్రజలు పడుతున్న కష్టాలపై మనస్సున్న మనిషిగా ప్రముఖ సినీనటుడు, జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాన్ మొదటిసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలులోని ఓ ఎస్బీఐ శాఖ ముందు క్యూలో నిలబడి బాలరాజు అనే వ్యక్తి మరణించాడని ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపుతున్నానని పవన్ కల్యాణ్ ట్విట్టర్లో పేర్కొన్నారు. నోట్ల రద్దు అంశం తెరపైకి రాగానే దేశవ్యాప్తంగా మరణించిన 80పైచిలుకు మంది మరణాలకు ఆయన సానుభూతి వ్యక్తం చేశాడు,
కేంద్రం తీసుకున్న నిర్ణయంపై విమర్శలను ఎక్కు పెట్టకుండానే.. ఆయన తనదైన శైలిలో సన్నాయి నోక్కులు నొక్కారు. ఈ మరణాలపై కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో పవన్ మాత్రం తనదైన శైలిలో మరణాలపై స్పందించారు. కర్నూలు జిల్లాలో గుండెపోటుతో మరణించిన బాలరాజు ఫొటోను కూడా పవన్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. తన డబ్బులు తాను తీసుకోవడానికి బాలరాజు మూడు రోజులుగా ప్రయత్నించారని, అయినప్పటికీ డబ్బు దొరకలేదని చివరికి బ్యాంక్లోనే మృతి చెందారని చెప్పారు. పార్లమెంటు సభ్యులు ప్రజల కష్టాలని పట్టించుకోవాలని పవన్ అన్నారు.
ప్రజలకి సంఘీభావం తెలపడానికి బీజేపి పార్లమెంటు సభ్యులు బ్యాంకుల దగ్గర క్యూలో నిలబడాలని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని బీజేపీ ఎంపీలు ప్రజలతో పాటు ఏటీఎమ్లు, బ్యాంకు ముందు నిలబడి, తమ మద్దతు ప్రకటిస్తే జనాలకి ధైర్యంగా ఉంటుందని ట్విట్టర్లో పేర్కొన్నారు. కమ్యూనిస్ట్ యోధుడు, క్యూబా మాజీ అధినేత ఫెడల్ క్యాస్ట్రో మృతి పట్ల కూడా పవన్ సంతాపం తెలిపారు. గొప్ప నేత ఫెడల్ క్యాస్ట్రో ఈ రోజు ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లారని, ప్రజల్లో స్పూర్తిని నింపిన ఆయనకు తమ పార్టీ సెల్యూట్ చేస్తోందని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. తాము అమితంగా అభిమానించే చెగువేరాతో కలిసి క్యాస్ట్రో చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకుంటున్నామని, క్యూబన్ల ప్రజారోగ్యం కోసం ఆయన అమితంగా కృషి చేశారని పవన్ ట్విట్టర్లో పేర్కొన్నారు. క్యాస్ట్రో ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు పవన్ చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more