గతంలో వారి మధ్య ఉన్న స్నేహాన్ని ఆసరాగా చేసుకుని తనను పెళ్లి చేసుకోవాలంటూ వేధింపులకు దిగాడు ఓ ప్రబుధ్దుడు. ఆమె ఒప్పుకోకపోవటంతో ఏకంగా నగ్న చిత్రాలతో బ్లాక్ మెయిలింగ్ కు దిగాడు. అంతటితో ఆగాడా అంటే.. అదీ లేదు. ఆ అమ్మాయికి కాబోయే భర్తకి, వారి బంధువులకు కూడా ఆ ఫోటోలు పంచాడు. మరి చివరకు ఆ శాడిస్ట్ ప్రేమికుడి గతి ఏమైందంటే...
బేగంపేటకు చెందిన బోరంచి రాజు అనే యువకుడు బెంగళూరుకు చెందిన ప్రియాంక మిందాల అనే యువతికి నాలుగేళ్ల క్రితం పరిచయమైంది. రాజు పని చేసే ఆఫీస్ లోనే ట్రెయినీగా ఆమె పని చేసింది. ఆపై బెంగళూరు టీసీఎస్ లో జాబ్ రావటంతో తిరిగి వెళ్లిపోయింది. ఇక అక్కడి నుంచి తనను పెళ్లి చేసుకోవాలంటూ రాజు వేధింపులకు దిగాడు. కానీ, ఆ యువతి పట్టించుకోలేదు. ఈ మధ్యే వేరే యువకుడితో నిశ్చితార్థం కూడా జరిగింది. విషయం తెలుసుకున్న రాజు ప్రతీకార చర్యకు దిగాడు.
గతంలో తన ల్యాప్ టాప్ పాడవటంతో రాజుకిచ్చి రిపేర్ చేయించమని ఆ యువతి కోరింది. ఇదే సందుగా భావించిన ఆ యువకుడు అందులోని పర్సనల్ ఫోటోలు, వీడియోలు జాగ్రత్తగా భద్రపరుచుకున్నాడు. అందులో కొన్ని నగ్న ఫోటోలు కూడా ఉన్నాయి. వాటిని ప్రియాంకకు కాబోయే భర్తతో పాటు అతని కుటుంబ సభ్యులకు మెయిల్ చేశాడు. ఈ విషయాన్ని వారు ఆమెకు తెలిపి.. అనంతరం హెచ్ఏఎల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
రంగంలోకి దిగిన రెండు ప్రత్యేక పోలీస్ బృందాలు ఫోన్ నంబర్ ఆధారంగా అతన్ని గుర్తించి గురువారం హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. కాగా, తాను ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారినంటూ తమను కూడా ఏమార్చే ప్రయత్నం చేశాడని బెంగళూరు పోలీసులు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more