లెక్క పక్కా లేని పాత 500, 1000 రూపాయలతో కూడిన ఓ బ్యాగ్ ను అధికారులు పట్టేసుకున్నారు. గుట్టు చప్పుడు కాకుండా మంగళవారం నాగాలాండ్లోని దిమాపూర్లో ఓ చార్టర్డ్ విమానంలో దీనిని తరలించాలని చూశారు. అయితే సీజ్ చేశామని అధికారులు అధికారికంగానే ప్రకటించినప్పటికీ ఆ తర్వాతే అసలు డ్రామా మొదలైంది. నోట్ల కట్టలు బుధవారం నుంచి కనిపించకుండా పోవడంతో కలకలం రేగింది.
దీంతో రంగంలోకి దిగిన నాగాలాండ్ పోలీసులు వివరణ ఇచ్చుకున్నారు. సీజ్ చేసిన డబ్బును సీఐఎస్ఎఫ్ అధికారులు ఆదాయ పన్నుల శాఖ(ఐటీ) అధికారులకు అప్పగించారని పోలీస్ చీఫ్ ఎల్ ఎల్ డౌంగెల్ తెలిపారు. నాగాలాండ్ వ్యాపారవేత్త అనాటో ఝిమోమీ ఆ డబ్బులకు సంబంధించిన ఐటీ లెక్కలు చూపడంతో ఆ సొమ్మును తిరిగి ఇచ్చేసినట్టు ఆయన వివరించారు.
ముందుగా డబ్బులు తీసుకెళ్లిన ఆయన ఆర్జీటీఎస్ ద్వారా వాటిని ఓ వ్యాపారవేత్తకు ట్రాన్స్ఫర్ చేసినట్టు అధికారులు గుర్తించారు. దీంతో ఝిమోమీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆపై లెక్కలు సరిగ్గా ఉండటంతోనే విడుదల చేసినట్లు అధికారులు చెబుతున్నారు.
నాగాలాండ్ గతంలో మూడు సీఎంగా పనిచేసి, ప్రస్తుతం ఆ రాష్ట్రం నుంచి ఏకైక ఎంపీగా ఉన్న నీఫియు రియో(బీజేపీకి మద్ధతు) అల్లుడే అనాటో ఝిమోమీ. ప్రస్తుత వ్యవహారంతో మనీలాండరింగ్ రాకెట్ ఉన్నట్టు గుర్తించిన అధికారులు ఝిమోమీని అదుపులోకి తీసుకుని, ఆపై విడుదల చేశారు. ఈ మొత్తం వ్యవహారం వెనక పలువురు వ్యాపారవేత్తలు ఉన్నట్టు దర్యాప్తులో వెల్లడైంది. ఇప్పటి వరకు మూడుసార్లు అదే విమానంలో డబ్బులను తరలించినట్టు ఝిమోమీ అంగీకరించినట్టు ఐటీ అధికారులు తెలిపారు. కాగా, అనాటో ఝిమోమీ తండ్రి కూడా గతంలో రాజ్యసభ నాగా పీపుల్స్ ఫ్రంట్ పార్టీ తరపున పనిచేశాడు కూడా.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more