4జీ మొబైల్ సర్వీసులతో భారత టెలికం ఇండస్ట్రీ రంగాన్ని ఒక కుదుపు కుదిపేసిన రిలయన్స్ జియో.. మరో సంచలనానికి కూడా తెరలేపనుంది. ఇప్పటికే ఉచిత కాల్స్, ఉచిత డేటాతో ఒక్కసారిగా పోటీదారులకు కునుకును కరువు చేసిన రిలయన్స్ మరో విప్లవాత్మక మార్పుకు సన్ధం అవుతోంది. దేశంలోని ఇప్పటికీ 2జీ ఫోన్లును వినియోగిస్తున్న ప్రజలను కూడా తన వైపు తిప్పుకునేందుకు రెడీ అవుతుంది. సరికోత్త 4జీ ఫోన్లను అత్యంత చౌకైన ధరకు అందించనుంది. వచ్చే ఏడాది తొలినాళ్లలోనే వీటిని ప్రజల అందుబాటులోకి తీసుకురానుంది.
దీంతో కొత్త కేటగిరీ ప్రజలను సొంతంచేసుకుని, లక్షల కొలదీ కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఫీచర్ ఫోన్ల లాంచింగ్ ఎంతో సహకరిస్తుందని ఈ టెలికాం వెంచర్ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ భావిస్తోంది. మార్కెట్లోకి తీసుకురాబోతున్న ఈ కొత్త తరం డివైజ్లలో రెండు వేరియంట్లను తీసుకురానుంది. వీటి ధర కూడా చాలా చౌకగా రూ.1000, రూ.1500గా ఉండనుందని, అయితే వీటిలో అపరిమితమైన వాయిస్ , వీడియో కాలింగ్, డిజిటల్ కంటెంట్ ఉంటాయని సమాచారం. ఎల్టీఈ, వాయిస్ ఓవర్ ఎల్టీఈ టెక్నాలజీతో ఫీచర్లు ఫోన్లను తీసుకొస్తుందని, ఈ ఫోన్లు ఎక్కువగా కాల్స్ కోసం వాయిస్ కాలింగ్ కోసం వాడే పేదలు, పెద్దలు, గ్రామీణ ప్రాంత కస్టమర్లను ఆకట్టుకుంటాయని పేర్కొంటున్నాయి.
అన్ని వర్గాల ప్రజలను తమ కస్టమర్లుగా మార్చుకోవడమే జియో ఉద్దేశ్యమని, మొదటిసారి డేటా వాడే కస్టమర్లను టార్గెట్ చేసుకుని ఈ డివైజ్లు మార్కెట్లోకి వస్తున్నాయని సంస్థ వర్గాలు పేర్కొన్నారు. కానీ రిలయన్స్ జియో తీసుకొచ్చే ఫీచర్ ఫోన్లోనూ ఇక ఈ టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. ఈ సరికోత్త ఫోన్లను జనవరి-మార్చిలో లాంచ్ చేసే అవకాశాలున్నాయి. వాటిలో టచ్ స్క్రీన్ మాత్రం వుండదని సమాచారం. ఈ తరుణంలో ఈ ఫోన్లు లాంచ్ అయితే దేశంలో ఎలాంటి విప్లవాత్మక మార్పులు వస్తాయన్నది వేచి చూడాల్సిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more