కర్ణాటక మైసూర్ సెంట్రల్ జైల్లో ఓ ఖైదీని తోటి ఖైదీ హత్య చేయటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అయితే దీంట్లో మత కోణం ఉందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. చనిపోయిన వ్యక్తి భజరంగ్ దళ్ కు చెందిన ఓ కార్యకర్త హత్యకేసులో నిందితుడు కావటమే దీనికి కారణం.
కిరణ్ శెట్టి అనే 29 ఏళ్ల వ్యక్తి ఓ హత్యకేసులో మైసూర్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. సదరు జైలులో ఉన్న మొహమ్మద్ ముస్తఫా(31)అనే మరో ఖైదీతో కిరణ్కి గొడవలున్నాయి. గత ఏడాది దక్షిణ కన్నడ జిల్లాలో ఓ భజరంగ్ దళ్ కార్యకర్తను చంపిన నేరంలో ముస్తఫా శిక్ష అనుభవిస్తున్నాడు. కిరణ్ ఇటీవలే జైలు కిచెన్ నుంచి చెంచాను చోరీ చేశాడు. అనంతరం దాన్ని నేలకు రుద్ది సన్నటి ఆయుధంగా తయారు చేసుకున్నాడు.
గురువారం ముస్తఫాకు ఆరోగ్యం బాగోలేకపోవటంతో జైలు నుంచి జైలులోని ప్రాథమిక చికిత్సాకేంద్రం వైపుకు వెళ్లడానికి సిద్ధమవడాన్ని కిరణ్ గమనించాడు. తనకూ వంట్లో బాగోలేదని పోలీసులకి చెప్పడంతో అతన్ని కూడా ముస్తఫాతో కలిపి ఆసుపత్రికి తరలించారు. ఇదే సమయంలో కిరణ్ తన దగ్గర ఉన్న చెంచాతో ముస్తఫా ముఖం, మెడ, ఛాతిపై కిరణ్ చెంచాతో విచక్షణారహితంగా దాడి చేశాడు. రక్తపుమడుగులో కొట్టుకుంటున్న ముస్తఫా తనను ఆసుపత్రికి తరలించేలోపే మృతిచెందాడు.
ఈ ఘటన మైసూరులో కలకలం రేపింది. భజరంగ్ దళ్ కార్యకర్తను చంపాడన్న కారణంగానే ముస్తఫాను మట్టుపెట్టాడని కిరణ్ పై ఆరోపణలు వస్తుండగా, తోటి ఖైదీలు మాత్రం వారిద్దరు ఎప్పటి నుంచో గోడవలు పడుతున్నారని చెబుతున్నారు. ఇక ముస్తఫాను మైసూరు మెడికల్ కాలేజీ మార్చురీ వద్దకు తరలించారన్న విషయం తెలుసుకున్న అతడి బంధువులు అక్కడకు పెద్ద ఎత్తున చేరుకొని నిరసన చేపట్టారు. ప్రస్తుతం అక్కడ టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలు నిర్వహించాల్సి ఉండగా, తాజా ఘటనతో కాస్త ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more