దేశంలో నకిలీ కరెన్సీ పెరిగి.. అసాంఘిక కార్యకలాపాలకు, సీమాంతర ఉగ్రవాదంతో పాటు దేశంలో ఉగ్రవాద చర్యలు కూడా అది శాసిస్తుందనడంలో సందేహం లేదు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ 1000 కరెన్సీ నోట్లను రద్దు చేసింది. అయితే కొత్తగా వీటిస్థానంలో రూ. 500, రూ. రెండువేల నోట్లను ప్రవేశపెట్టి.. ఇవాళ్టి నుంచి దానిన అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం కూడా తెలిసిందే. ఇప్పటికే దేశంలోని పలు నగరాలు, పట్టణాలలో రెండు వేల రూపాయల కరెన్సీ నోట్లను తాము పొందామని, అవి చాలా బాగున్నాయని సోషల్ మీడియాలో సెల్పీలతో పాటు ప్రజలు పోస్ట్ చేస్తున్న విషయం కూడా తెలిసిందే.
అయితే 500 రూపాయల నోటును మాత్రం ఇంకా బ్యాంకులు విడుదల చేయడం లేదు. మరో రెండు మూడు రోజుల వ్యవధిలో వాటిని కూడా చెలామణిలోకి తీసుకురానున్నారు. ఇక మారుమూల బ్యాంకులకు కూడా ఇవాళ సాయంత్రం లేదా రేపు ఉదయానికి కొత్త నోట్టు అందుబాటులోకి వస్తాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా బ్యాంకులు, ఏటీయంల వద్ద కాపలా తప్పనిసరిగా వుండచాలని కేంద్రం అదేశాలను కూడా జారీ చేసిందని సమాచారం.
కాగా, ముఖ్యంగా పాకిస్థాన్ కేంద్రం విడుదల చేసిన కొత్త నోట్లను కూడా పాకిస్తాన్ ముద్రించవచ్చునన్న అనుమానాలు రెకెత్తతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా చెలమణిలోకి వచ్చిన రూ.2 వేలు, రూ.5 వందల నోట్ల విషయంలోను కాపీ చేయడం అసాధ్యమని ఇంటెలిజెన్స్ వర్గాలు స్పష్టం చేశాయి. పాకిస్థాన్, అది ప్రేరేపిస్తున్న ఉగ్రవాద సంస్థలు ఈ నోట్లకు నకిలీలు సృష్టించడం అసాధ్యమైన పని అని సీనియర్ ఇంటెలిజెన్స్ అధికార వర్గాలు పేర్కోంటున్నాయి. పాకిస్తాన్, ఉగ్రవాద సంస్థలకు వీటి ముద్రణ అసాధ్యమని తేల్చిన తరువాతే ఆ డిజైనింగ్ చేసినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో గూఢచార సంస్థ రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్(రా), ఇంటెలిజెన్స్ బ్యూరో, డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ)లు కొత్తనోట్లను అన్ని రకాలుగా పరిశీలించాయి. వాటిని పాకిస్తాన్ కానీ అక్కడి ఉగ్రవాద మూకలు కానీ నోటును నకిలీ చేయలేవని దృవీకరించినట్లు సమాచారం. ఈ కోత్త నోట్లలోని సెక్యూరిటీ ఫీచర్లను పూర్తిస్థాయిలో విశ్లేషించిన తరువాతే వాటిని చెలామణిలోకి తీసుకోచ్చారని తెలుస్తుంది. అయితే ఆ నోట్లలో ఎన్ని సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నాయన్న విషయాన్ని అధికారులు గోప్యంగా వుంచుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more