సార్వత్రిక ఎన్నికలకు ముందు నవ్యాంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కావాలంటే తమ కూటమికే ఓటు వేయాలని, హోదాను సాధించాలంటే అది తమకే సాధ్యమని చెప్పకోచ్చని పార్టీలు అధికార పీఠమెక్కగానే స్వరం మార్చాయి. హోదా ఒక్కటే సంజీవని కాదు.. హోదా కన్నా ప్యాకేజీయే ముఖ్యమని, హోదాతో చేకూరని లబ్ది కూడా ప్యాకేజీతో చేకూరుతుందని మాయమాటలు చెబుతున్నారు. అయితే హోదా మా హక్కు అంటూ నినదిస్తున్న విపక్షాలను అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రంలోని అధికార పక్షం కాని పట్టించుకున్న దాఖలాలు లేవు.
అయితే ప్రత్యేక హోదాపై పునర్విభజన సమయంలో పార్లమెంటులో వెంకయ్యనాయుడు, ఎన్నికల సమయంలో చంద్రబాబులు, ప్రచారంలో ప్రధాని నరేంద్రమోడీలు ఎం చేప్పారన్న విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లినా.. దానిని అటకెక్కించే ప్రయత్నంలో మాత్రం చంద్రబాబు సక్సెస్ అయ్యాడు. హోదాకు ప్యాకేజీని లింకు పెట్టి అంతకన్నా అధిక లభ్ది అని చాటడంలో సక్సెస్ అయ్యాడు. దీంతో రంగంలోకి దిగిన కాంగ్రెస్.. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ప్రజా బ్యాలెట్ నిర్వహించింది.
ప్రజా బ్యాలెట్ ఫలితాలను ఇవాళ ఏపీపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి వెల్లడించారు. ఏపీకి ప్రత్యేక హోదా అనే విషయంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన పోలింగ్ లో పాల్గొన్న వారిలో 18693 మంది ఏపీకి ప్రత్యేక హోదా కావాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. కాగా 28 మంది తమకు ప్రత్యేక హోదా వద్దని ఓటు వేశారు. అయితే ప్రత్యేక హోదాతో ఏపీకి నష్టమేమిటన్నన విషయాన్ని మాత్రం వారు వెల్లడించలేదనిమాత్రమే హోదా వద్దు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారట. ఇదే క్రమంలో టీడీపీ ఎన్నికల హామీల విషయంలో... 18311 మంది హామీలు నెరవేరలేదని చెప్పగా 32 మంది మాత్రం హామీలు నెరవేరాయని ఓటేశారని ఆయన వివరించారు.
దీంతో ప్రత్యేక హోదాతోనే నవ్యాంధ్ర అభివృద్ధి చెందుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారని రఘువీరారెడ్డి అన్నారు. తాము నిర్వహించిన ప్రజా బ్యాలెట్ తో ప్రజాభిప్రాయం స్పష్టంగా ప్రస్పుటించిందన్నారు. ఇప్పటికే ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని ప్రకటించి, సన్మానాలు చేసుకుంటున్న కేంద్ర మంత్రి వెంకయ్య, అంతకన్నా అధిక లబ్దిని చేకూర్చుతున్న ప్యాకేజీలకు బదులు తమ ప్రభుత్వ హయాంలో ప్రకటించిన హోదాను ఏపీకి వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more