జ్వరం, ఊపిరితిత్తులలో ఇన్ఫక్షన్ సోకడంతో సెప్టెంబర్ 22న చెన్నైలోని అపోలో అస్పత్రిలో చేరి.. సుమారు 49 రోజులుగా చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అరోగ్యం విషయమై అందోళన చెందిన అన్నాడీఎంకే వర్గాలకు మరో తీపి కబరు అందింది. మరో పక్షం రోజుల్లో అమ్మ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యి.. ఇంటికి చేరుకుంటారని అన్నాడీఎంకే వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం అమ్మ అరోగ్య విషయమై ఎలాంటి అందోళన అవసరం లేదని, అమె సాధారణ స్థితికి చేరుకుంటున్నారని అన్నాడీఎంకే వర్గాలు స్పష్టం చేశాయి. దీంతో పార్టీ కార్యకర్తలు, శ్రేణులు సంబరంలో మునిగారు.
ప్రస్తుతం వైద్యులు అమ్మకు ఫిజియోథెరపీ చేస్తున్నారని, మరో పక్షం రోజులు క్రమం తప్పకుండా దానిని నిర్వహించాల్సిన కారణంగా అమె 15 రోజుల తరువాత ఇంటికి చేరుకుంటారని అన్నాడీఎంకే అధికార ప్రతినిధి సి. పొన్నియన్ చెప్పారు. సీసీయూ నుంచి రూమ్లోకి మార్చే విషయంపై ఆయన సమాధానమిస్తూ.. అత్యవసర పరికరాలు లేనందున అమ్మను అస్పత్రి వర్గాలు సిసియులోనే వుంచాయన్నారు. అపోలో ఆస్పత్రుల చైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి ప్రకటనపై కూడా స్పందించిన ఆయన.. పూర్తిస్థాయిలో అమ్మ కోలుకుని, మామూలు మనిషి అయిన తర్వాత మాత్రమే ఇంటికి వెళ్లాలని జయలలిత భావిస్తున్నట్లు పొన్నియన్ తెలిపారు.
అమ్మ ఆస్పత్రిలోనే మరికొన్ని రోజులు ఉంటే మంచిదని, బయట వాతావరణంలోకి వస్తే మళ్లీ ఇన్ఫెక్షన్లు వ్యాపించే ప్రమాదం ఉందని. ఈ క్రమంలో మళ్లీ వ్యాధి తిరగమోత పెట్టే ప్రమాదం కూడా వుంటుందని భావించి మరికోన్ని రోజుల అమ్మ అసుపత్రిలోనే వుంటే మంచిదని తాము బావిస్తున్నామని అయన చెప్పారు. ఇంటికి వెళ్లారంటే జయలలిత ఊరికే ఉండరని, మళ్లీ పూర్తిగా పనుల్లో నిమగ్నం అవుతారని, అందువల్ల ఆమె అలసిపోయే అవకాశం ఉన్నందున మరికొన్నాళ్ల పాటు ఆస్పత్రిలోనే విశ్రాంతి తీసుకుంటే మంచిదని పొన్నియన్ అన్నారు. అయితే అమ్మను కలిసేందుకు ఎవరినీ అనుమతించడం లేదని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more