మనిషి మేధస్సుకు ప్రపంచంలో కొలమానమే లేకుండా అద్భుతాలు చేస్తున్న తరుణంలో తమ కళ్ల ముందు ఏదైనా ఓ ఘటన జరిగితే.. అందుబాటులోకి వచ్చిన సాంకేతిక విఫ్లవం నేపథ్యంలో స్మార్ట్ ఫోన్లలలో నిక్షిప్తం చేయడానికే అధిక ప్రాధాన్యత లభిస్తుంది తప్ప.. అపదలో వున్న వారిని అదుకోవాలన్న మనుషులలోని మానవత్వం మంటగలిసిపోతుంది. హైదరాబాద్ హైటెక్ సిటీ వద్ద తన కారు ప్రమాదానికి గురైన సందర్భంలోనూ అక్కడి సాప్ట్ వేర్ ప్రోఫెషనల్స్ వ్యవహరించి తీరు కూడా సరిగ్గా ఇదే.
తనకు ఎదురైన వింత అనుభవానికి నటుడు ప్రకాష్ రాజ్ విస్మయం వ్యక్తం చేశారు. ఏమిటీ.. మనుషుల.. అపన్నహస్తం అందించేందుకు బదులు తమ ఫోన్లు తీసి జరిగిన ఘటనను తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించి.. వాటిని సోషల్ మీడియాలో పెట్టేందుకు పోటీపడుతున్నారని ఒకింత అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఇటీవల ఢిల్లీలో ఓ మనిషి ప్రమాదానికి గురై రక్తపు మడుగులో వుండి తనకు సాయం అందించే అపన్న హస్తం కోసం రమారమి ఆరు గంటలపాటు వేచి చూసినా.. సెల్ ఫోన్ ఎత్తుకెళ్లారే తప్ప.. అదుకునే నాథుడే కరువయ్యాడు.
అయితే సాంకేతిక విప్లవం, ఆధునాత పరిజ్ఞానం మనుషుల అవసరాలను తీర్చుకుని మరింత అధికంగా ఒకరి సాయంగా నిలిచేందుకే తప్ప.. వారి ప్రాణంలో పోతున్న సమయంలో వారు విలవిలలాడుతున్న పట్టించుకోకుండా నిచేష్టులుగా, మరమనుషులు తమ పనులు తాము చేసుకుపోవడానికి మాత్రం కాదు. ఎలాంటి సాంకేతికత లేకపోయినా.. బుద్దే కాదు, మాటలు కూడా రాని మూగజీవాలు వున్నపాటి ఐక్యత, సానుభూతి, అండగా నిలిచేందుకు అవి పడే పాట్లు అనేక సందర్భాలలో మనం చూస్తునే వున్నాం.
తాజాగా అడవి మార్గంలో సంచరిస్తూ రెండు ఏనుగులు మంద నుంచి విడిపోయి గ్రామాలపైపుకు వచ్చాయి. అనుకోకుండా అవి బావిలో పడ్డాయి. వాటి అరుపులతో సమాచారాన్ని అందుకున్న ఏనుగులు మంద అక్కడికి చేరుకుంది. వాటికి అండగా నిలిచాయి. మంద అంటే ఒకటో, రెండో ఏనుగులు కాదు ఏకంగా 120 ఏనుగులు బావి చుట్టూ నిల్చుని వాటికి మేమున్నాం మీకేం కాదు అన్న దైర్యాన్ని ఇచ్చాయి.
వవరాల్లోకి వెళ్తే.. పశ్చిమబెంగాల్ పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలోని లల్కా గ్రామ శివార్లలోని ఓ బావిలో రాత్రి 8గంటల సమయంలో రెండు ఏనుగులు ప్రమాదవశాత్తు పడిపోయాయి. ఈ విషయాన్ని గ్రహించిన ఏనుగులు ఆ గ్రామంపైకి దాడికి వచ్చాయి. అయితే బావిలో పడిని రెండింటిలో ఒక ఏనుగు అప్పుడే ప్రసవించడంతో.. ఏనుగుల మంద బావి చుట్టూ రక్షణ వలయంగా కాపాలా కాస్తూ నిల్చున్నాయని, దీంతో వాటిని బయటకు తీయలేకపోయినట్టు డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ రవీంద్రనాథ్ సహ తెలిపారు. ఏనుగుల గుంపు గ్రామంపైబడి దాడులకు యత్నించవచ్చన ఆందోళనకు గురైన పరిసర ఏజెన్సీల ప్రజలు ఇళ్లు విడిచి ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more