బీహార్ లో గుండారాజ్యం రాజ్యమేలుతుందని చెప్పడానికి ఇది ఓ ఉధాహరణగా నిలుస్తుందని చెప్పవచ్చ. సినీమాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సాగే స్టంట్స్ లను తలపించేలా వున్న ఘటనలను.. నిజజీవితంలోనూ చేస్తే.. అవి పాశవిక చర్యలు కాక మరేమంటాము. వీటితో మనుషులు ఉసురు తీస్తుంటే.. ప్రభుత్వాలు ఏంచేస్తున్నాయ్.. చట్టం తన పని అంతా అయిపోయిన తరువాత చేస్తే మాత్రం లాభమేమిటి అన్న ప్రశ్నలు ఉదయించక మానవు. ఇంత జరిగినా పోలీసులు మాత్రం నిందితులు పరారీలో వున్నారన్న సమాధానాలే పఠించడం పలు అనుమానాలకు దారితీస్తుంది.
ఇటీవల ముజాఫర్ పూర్ లో ఓ దళిత విద్యార్థి బాగా చదువుతున్నాడన్ని అతని తరగతి విద్యార్థులే అతనిపై దాడి చేసిన ఘటన పెను సంచలమైన నేపథ్యంలో అలాంటి కారణంతోనే ఈ ఘటన జరిగిందా..? లేక ఏకపక్ష ప్రేమ వ్యవహారమే ఇందుకు కారణమా తెలియదు కానీ.. నడిరోడ్డుపై పదవ తరగతి విద్యార్థినిని పాశవికంగా హత్యచేశారు. 15 ఏళ్ల బాలికను ముగ్గురు దుండగులు తమ బైకుతో ఈడ్చుకెళ్లి దారుణంగా చంపేశారు.
కైముర్ జిల్లా కార్జావ్ గ్రామంలో హాటా-దుర్గావతి ప్రధాన రహదారిపై ఈ దారుణ ఘటన చోటుచేసుకోగా, ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా వున్ానయి. ఫకారాబాద్ గ్రామానికి చెందిన టెన్త్ విద్యార్థిని తన ముగ్గురు స్నేహితురాళ్లతో కలిసి హాఫ్ ఇయర్లీ పరీక్షలు రాసేందుకు వెళుతుండగా బైకుపై వచ్చిన ముగ్గురు దుండగులు ఆమె దుప్పటా(చున్నీ) పట్టుకుని లాగారు. మెడకు చున్నీ చుట్టకుని ఆమె కింద పడిపోయింది. ఆమెను బైకుతో 50 మీటర్ల వరకు ఈడ్చుకుపోయారు. అక్కడితో ఆగకుండా ఆమెపైనుంచి బైకు నడిపారు. తీవ్రగాయాలతో బాధితురాలు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది.
బైకు గోతిలో పడి ముగ్గురు దుండగులు కిందపడిపోయారు. వీరిని స్థానికులు పట్టుకోవడానికి ప్రయత్నించడంతో బైకు అక్కడే వదిలేసి పారిపోయారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలిక మృతదేహంతో రోడ్డుపైనే బైఠాయించారు. హంతకులను అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను పట్టుకునేందుకు రెండు పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్టు ఏఎస్పీ తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more