దేశ ప్రధానిగా దాదాపు రెండున్నర సంత్సరాలుగా పదవి బాధ్యతలను నిర్వర్తిస్తున్న ప్రధాని నరేంద్రమోడీకి తాజాగా ఊహించని షాక్ తగిలింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ పిటీషన్ దాఖలైంది. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నిలలో బీజేపి అభ్యర్థి నరేంద్రమోడీ తన ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అయిన అజయ్ రామ్ పై మూడు లక్షల 71 వేల ఓట్ల మోజారిటీతో గెలుపోందారు. అయితే మోడీ ఎన్నికల చెల్లనేరదని, మోడీ చేతిలో పరాజయం పాలైన కాంగ్రెస్ ఎమ్మెల్యే అజయ్ రాయ్ అలహాబాద్ హైకోర్టులో పిటీషన్ దాఖలైంది.
ఈ పీటీషన్ వచ్చే నెల 15న విచారిస్తామని అలహాబాద్ హైకోర్టు పిటీషనర్ కు తెలిపింది. ప్రధాని నరేంద్రమోడీ తరపు కౌన్సిల్ సత్యపాల్ జైన్ వాదనలను పరిగణలోకి తీసుకొని న్యాయస్థానం పిటీషన్ ను విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది. ప్రధాని నరేంద్రమోడీ ప్రతిష్టను భంగం కలిగించే ఇలాంటి పిటీషన్లను విచారణకు స్వీకరించడం బావ్యం కాదని మోడీ తరపు న్యాయవాది సత్యపాల్ జైన్ అన్నారు,. మోడీపై కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యతోనే రాయ్ పిటిషన్ దాఖలు చేశారని, మోడీ ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ చూపిన కారణాలు అసంబద్ధంగా ఉన్నాయని అన్నారు. వీటని స్వీకరించి న్యాయస్థానం తన సమయాన్ని వృధా చేసుకోరాదరని వీటిని అదిలోనే తుంచివేయాలని అయన చేసిన వాదనలను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వికే శుక్లా తోసిపుచ్చారు.
మోడీ ఎన్నిక చెల్లదంటూ అజయ్ రాయ్ దాఖలు చేసిన పిటీషన్ లో అనేక విషయాలను పొందుపర్చారు. ఎన్నికల సమయంలో నిబంధనలకు వ్యతిరేకంగా మోడీ వ్యవహరించారని, కాబట్టి వారణాసి ఎంపీగా ఆయన ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. రాయ్ తరఫు న్యాయవాదులు.. మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో మోడీ చిత్రాలున్న టీషర్ట్ లను, పోస్టర్లను ఓటర్లకు పంచిపెట్టారని... ఇది ఓ విధంగా ఓటర్లకు లంచం ఇవ్వడం కిందకే వస్తుందని పేర్కొన్నారు. కాబట్టి ఓటర్లను ప్రలోభ పెట్టి మోడీ తనకు అనుకూలంగా ఓట్లు వేయించుకున్నారని, ఈ నేపథ్యంలో ఆయన ఎన్నిక చెల్లదని వాదించారు. మొత్తానికి ఈ పరిణామం మోడీకి షాక్ అంటున్నారు విశ్లేషకులు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more