కానుకల ఇస్తే తీసుకోని వారెవరుంటారు..? కానుకలను తప్పని సరిగా తీసుకురావాలని, లేదా కానుకలను కేవలం క్యాష్ రూపంలోనే ఇవ్వాలని ప్రత్యేకంగా అర్థిస్తూ.. అ మేరకు తమ ఆహ్వాన పత్రికలోనూ ముద్రించే వారున్న ఈ రోజుల్లో కానుకలను వద్దు అని చెప్పేవారు ఎవరుంటారు. అయితే అరుదైన కానుకుతో కంటి మీద కునుకు కరువైన వారు కూడా లేకపోలేదు. ఇలాంటి వారి జాబితాలోకి వచ్చే వారే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య.
తన మిత్రుడు ఇచ్చిన చేతి గడియారంతో తాను ఎదుర్కోన్న అనవసర రభసతో మనశ్శాంతి కరువై.. వాటిపై విపక్షాలకు సమాధానాలకు చెప్పలేక.. అనవసర తలనొప్పిని తెచ్చుకున్నారు. అటు విపక్షాలతో పాటు ఇటు సొంత పార్టీకి చెందిన నేతలు కూడా ఆయనను ముప్పుతిప్పలు పెడుతూ.. అయనపై ఏకంగా అధిష్టానానికి పిర్యాదు చేసి.. అయనను తొలగించాలని కూడా డిమాండ్ చేసిన విషయం తెలిసింది. ఏసీబీ క్లీన్చిట్తో బయటపడిన ఆయన కానుకలు అంటేనే జంకుతున్నారు. ఇప్పడా వాచ్ కర్ణాటక విధాన సభ హాలులో ఏర్పాటు చేయబడి వుంది.
దీంతో కానుకులో ఇప్పటికే తలబొప్పికట్టిన నేపథ్యంలో కానుకలంటే సిద్దరామయ్యకు హడలిపోతున్నారు. సొంత పార్టీకి చెందిన వారి నుంచి మొదలుకుని తన మంత్రివర్గ సహచరులు తమ శాఖ ఆధ్వర్యంలో ఉత్పత్తి చేసిన కానుకలను కూడా తీసుకునేందుకు అయన జంకుతున్నారు. ఎంతలా అంటే తన సహచర మంత్రి ఏ.మంజు ఇచ్చిన అందమైన గిఫ్ట్ ప్యాక్ చూసి ఆయన ఏకంగా షాక్ అయ్యారు. మంత్రి వివరణ ఇవ్వడంతో అందులో ఏమున్నాయని తెలుసుకున్న సిద్ధరామయ్య.. తాను సిల్క్ జుబ్బాలు ధరించనని సున్నితంగా తిరస్కరించారు.
కాగా గతంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ధరించిన రూ.70 లక్షల రూపాయల ఖరీదు చేసే హెబ్లేట్ లగ్జరీ వాచ్ సృష్టించిన పెను ప్రకంపనలను చల్లార్చేందుకు ఆయన చాలా శ్రమించాల్సి వచ్చింది. సాధారణ జీవితాన్ని గడిపేందుకు ఇష్టపడతానని చెప్పుకునే ఆయన ఇంత ఖరీదు చేసే వాచ్ను చేతికి పెట్టుకోవడంపై ప్రతిపక్ష నేత హెచ్.డి.కుమారస్వామి అప్పట్లో అనేక ప్రశ్నలను సంధించారు. దీంతో ఇంటా, బయట వాయింపులతో ఇరుకునపడ్డ సిద్దరామయ్య ఏసీబీ న్యాయస్థానం క్లిన్ చిట్ ఇవ్వడంతో ఊపిరిపీల్చుకున్నారు. దీంతో అప్పటి నుంచి కానుకలు అంటేనే సిద్ధరామయ్య భయపడుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more