దేశవ్యాప్తంగా కేబుల్ బ్రాడకాస్టర్స్ వసూలు చేసే కేబుల్ టారిఫ్ పై ట్రాయ్ సంచలన నిర్ణయం తీసుకుంది. కొన్ని ప్రాంతాలవారికి ఇది వరంగా వుండగా, మరికోన్ని ప్రాంతాల వారీకి ఇది భారంగా మారనుంది. పలు రాష్ట్రాలలో వంద చానెల్లను ప్రసారం చేసినా కేబుల్ అపరేటర్లు సుమారుగా 130 రూపాయల బిల్లను మాత్రమే తీసుకుంటుండగా, ఈ నూతన నిర్ణయం ద్వారా పన్నుల భారం వినియోగదారులపై పడుతుంది. ఇక అనేక ప్రాంతాల్లో కేబుల్ అపరేటర్లు సుమారుగా 200 రూపాయలను వసూలు చేస్తుండగా, వారికి అదనపు చార్జీలపై ట్రాయ్ కత్తర పడనుంది.
కేబుల్ ప్రసారాల డిజిటలైజేషన్ తప్పనిసరి చేసిన నేపథ్యంలో డిజిటలైజేషన్ కేబుల్ ధరలపై కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి వినియోగదారుల నుంచి వసూలు చేసే చార్జీలపై పరిమితిని విధించాలని ప్రతిపాదించింది. అధిక మొత్తాలను వసూలు చేయకుండా వంద చానళ్లను ప్రసారం చేసే సెట్ టాప్ బాక్స్ కు నెలకు రూ. 130 మాత్రమే వసూలు చేయాలని చెప్పింది. దీనిపై పన్నులను అదనంగా వసూలు చేస్తారు. మొత్తంగా కలిపితే 150 రూపాయల వరకు చెల్లించాల్సి వస్తుంది. కాగా ఈ నిబంధన కింద కచ్చితంగా 100 చానళ్లను కస్టమర్లకు అందించాల్సిందేనని తెలిపింది.
దీని ప్రకారం ప్రతి ప్రసార లేదా వేర్వేరు భౌగోళిక ప్రాంతాలలో పే, ఫ్రీ ఛానల్స్ వివరాలను స్పష్టంగా ప్రకటించాలని కోరింది. ఇంకా ఎక్కువ చానళ్లు కావాలని భావించే వారి కోసం పలు శ్లాబ్ లను ప్రకటిస్తూ, రూ. 25 చొప్పున అదనంగా చెల్లించి ఆ చానళ్లను తీసుకోవచ్చని పేర్కొంది. తమకు నచ్చిన చానళ్లను వీక్షించే సౌలభ్యాన్ని దగ్గర చేసేందుకే ఈ మార్పులు చేసినట్టు ట్రాయ్ అధికారి ఒకరు వివరించారు. డ్రాఫ్ట్ టెలి కమ్యూనికేషన్ టారిఫ్ ఆర్డర్, 2016ను రిలీజ్ చేసిన ట్రాయ్ దీనిపై లిఖిత పూర్వక అభిప్రాయాలను అక్టోబర్ 24, 2016 లోపు తెలియజేయాలని కోరింది. మరోవైపు ట్రాయ్ ప్రతిపాదనలపై ఎనలిస్టులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
టెలికాం రెగ్యులేటరీ సరైన నిర్ణయం తీసుకుందని, కానీ పరిష్కరించాల్సిన కొన్ని సమస్యలు ఉన్నాయని పెట్టుబడి బ్యాంకు అమెరికా మెర్రిల్ లించ్ పేర్కొంది. కేటగిరీలను స్పష్టంగా నిర్వచించిన లేదని తెలిపింది. డిజిటైజేషన్ ఇప్పటికీ పూర్తి కాకలేదని, ఎవరెవరు ఎంతెంత చెల్లిస్తున్నారనేది క్లారిటీ లేదని పేర్కొంది. అలాగే ఈ కొత్త ధరలపై వినియోగదారులకు అవగాహన కల్పిండానికి సమయం తీసుకుంటుందని వ్యాఖ్యానించింది. అలాగే ఈ ప్రతిపాదన నచ్చని బ్రాడ్ కాస్టర్స్ కోర్టు కెళ్లి స్టే తెచ్చుకుంటారని అభిప్రాయపడింది. ధర పరిమితి విధించడం సహేతుకమైనదని కొటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ తెలిపింది. ట్రాయ్ ప్రతిపాదిత టారిఫ్ ముఖ్య లక్ష్యం వినియోగదారుల ఆసక్తిని రక్షించుకోవడమేనని పేర్కొంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more