ఓ పైపు తాను ఎలాంటి తప్పు చేయను, ఎవరితో మాట పడను అంటూ చంద్రబాబు తాను అడ్డంగా ఓటుకు నోటు కేసులో దోరికిన తరువాత కూడా నీతి నిజాయితీ అంటూ వచనాలు చేస్తున్న తరుణంలో తన సోంత పార్టీ ఎంపీ సంచలన అరోపణలు చేశారు, ప్రస్తుతం టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ఎన్నడూ లేనంత అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని అరోపించారు, ఇంతకీ అయన ఎవరంటారా.? ఆయనే నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు. గుంటూరు జిల్లా వినుకొండలో శివశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన అయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో దుమారాన్ని రేపుతున్నాయి.
పార్టీ జాతీయ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తెలియకుండా ఇవన్నీ జరుగుతున్నాయా.? అన్న అనుమానంతో తాను టీడీపీ నేతలు చేస్తున్న అవినీతి, అక్రమాలను బాబు దృష్టికి తీసుకెళ్లిన సమయంలో ఆయన కూడా తనపై అక్షింతలు వేస్తున్నారంటూ నవ్వుతూనే.. మరోసారి పార్టీ నాయకుల అవినీతి, ఆగడాలపై వ్యాఖ్యలు చేశారు. ఎన్నడూ లేనంత అక్రమాలు, అవినీతి పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు.
పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధుల చిట్టా చంద్రబాబు వద్ద ఉందని, జిల్లాలో దాదాపు అందరూ మైనస్ గ్రేడ్లలోనే ఉన్నారని చెప్పారు. ప్రతి ఒక్కరి అవినీతి చిట్టా చంద్రబాబు తెప్పించుకున్నారన్నారు. విశాఖపట్నం రైల్వే జోన్ కావటం కష్టమని, అన్ని వసతులున్న గుంటూరుకు జోన్గా మార్పు చేయటం సులభమని పలుమార్లు చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లినా ఆయన ‘గమ్మునుండు..’ అంటున్నాడన్నారు. విశాఖకు ఏ విధంగా రైల్వే జోన్ వస్తుందని, వారి పోరాటం వృథా అవుతుందని చాలా సందర్భాల్లో సీఎం దృష్టికి తీసుకువచ్చినట్లు చెప్పుకొచ్చారు
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more