ఇండియన్ ఆర్మీ గురించి ప్రముఖ నటుడు ఓం పురి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదుల దొంగ దోబ్బతో 19 మంది భారతీయ జవాన్లను అమరవీరులుగా మార్చిన ఉడీ ఘటన నేపథ్యంలో పాకిస్థాన్ నటులపై భారత్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్(ఐఎమ్పీపీఏ) నిషేధం విధించడంపై ఆయన పెదవి విరిచారు. అమరవీరులైన భారత సైన్యంపై ఆయన అవమానకర వ్యాఖ్యలు చేశారు. సినీ నటుడిగా దేశంలో స్వేఛ్చా వాయువును పీలుస్తున్న ఆయన.. చలికి, ఎండకు, వానకు ఎదురీదుతూ భారత మాతను, దేశ ప్రజలను రక్షిస్తున్న సైనికులను కించపర్చేలా వ్యాఖ్యలు చేయడం అయన అవివేకాన్ని బయటపెడుతుంది. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వివాదం రాజుకున్నాయి.
ఓం పురి చేసిన వ్యాఖ్యలు ఈ విధంగా ఉన్నాయి..
* ఆర్మీలో వారిని ఎవరు చేరమన్నారు? (ఎవరు చెబితే పురి నటనా రంగాన్ని ఎంచుకున్నారు)
* ఎవరు వారిని ఆయుధాలు పట్టుకోమన్నారు (ఎవరు చెప్పారని ముఖానికి రంగులేసుకున్నారు)
* మేమేమి జవాన్లను ఆర్మీలో చేరమని చెప్పలేదుగా (ప్రజలు ఆయనను నటుడు కావాలని కోరుకోలేదుగా..)
* 15 నుంచి 20 మానవ బాంబులు తయారుచేయండి (చెప్పడం చాలా ఈజీ. మీరు మొదటి మానవబాంబు అవుతారా.?)
* పాకిస్తాన్ను పేల్చడానికి వాటిని వాడండి (పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదంపై మాత్రమే భారత్ యుద్దం)
* ఇజ్రాయిల్, పాలస్తీనా మాదిరి భారత్-పాకిస్తాన్లు కూడా యుగయుగాలుగా శత్రువులుగా మారలనుకుంటున్నారా? (కాల్పులు ఉల్లంఘనకు పాల్పడుతున్నదెవరో తెలిసి కూడా ప్రశ్నించే మూర్ఖత్వం వీడండి)
* కోట్లమంది ముస్లింలకు భారత్ పుట్టినిల్లు (మన దేశం ముస్లింలు కూడా పాకిస్తాన్ ఉద్రవాదాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు)
* భారత్-పాకిస్తాన్ విభజన అంటే కేవలం దేశాల విభజనే మాత్రమే కాదు, కుటుంబాలు విడిపోవడం కూడా. ( సంయమనం పాటించిన మనకు కాదు.. ఉద్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాక్ తెలియాలి)
* భారతీయుల కుటుంబసభ్యులు అక్కడ ఉన్నారు. అక్కడ వారు ఇక్కడా ఉన్నారు. (అ విషయాలు తెలుసు కాబట్టే భారత్ సంయమనంతో వ్యవహరిస్తుంది)
* సరిహద్దు కుటుంబాలు ఎలా యుద్ధం చేసుకుంటారు? ( యుద్దం కుటుంబాల మధ్య కాదు.. ఉగ్రవాదంపైన మాత్రమే కనీసం దేశాల మధ్య కూడా కాదు.)
* పాకిస్తాన్ నటులను, సెలబ్రిటీలపై నిజంగా నిషేధం విధించాలంటే, భారత ప్రభుత్వాన్ని వారి వీసాలు రద్దు చేయండి. ( నిషేదాన్ని మీలాంటి నటులు జీర్ణంచుకోలేకపోతున్నారు..)
ఇది యుద్దం కాదన్న విషయం కూడా ఆయనకు తెలియదు. యుద్దం అనేది రెండు దేశాల మధ్య వుంటుంది. పాకిస్థాన్ తమ దేశంలో వేళ్లూనుకుంటున్న ఉగ్రవాదాన్ని అణిచివేయడంలో విఫలమైంది కాబట్టే మనం దానికి సమాధానం ఇస్తున్నాం. ఎందుకు ఉగ్రవాదాన్ని అరికట్టలేకపోతున్నారని అగుడుతున్నాం. ఉగ్రవాదం అనే పాముకు పాలు పోసి పెంచడం మాకే కాదు మీకు కూడా నష్టమని చెప్పినా పెడచెవిన పెడుతుంది. ఆర్మీ పాఠశాలపై దాడి చేసి జవాన్ల పిల్లలను రక్తాన్ని కల్లజూసిన ఘటనను కూడా మర్చిపోయింది.
ఉద్రవాదులను అస్త్రాలుగా మలుచుకుని మనపైకి ఉసిగోల్పుతున్న తీరును మానుకోమ్మని మాత్రమే భారత్ చెప్పింది. భారత ఆర్మీ పవర్ గురించి తెలియక కాదు..తెలిసే ఇలాంటి చర్యలకు పాక్ పాల్పడుతుంది. విసురుతూ దొంగదెబ్బలు తీస్తూగతంలోనూ ముందు కూడా పాకిస్తాన్ నటులకు ఆయన మద్దతిచ్చారు. వాలిడ్ వీసాతో వారు ఇక్కడ పనిచేస్తున్నారని, వారిని నిషేధించడం సరికాదన్నారు. పాకిస్తానీ నటులపై నిషేధం, పరిస్థితుల్లో మార్పు తేవన్నారు. దీంతో ఓం పురి వివాదాస్పద వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more