ప్రముఖ న్యాయవాది, దళిత ఉద్యమ నేత, పౌర హక్కుల సంఘం నాయకుడు, ధళిత వర్గాల అశాకిరణం బొజ్జా తారకం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారొగ్యంతో బాధపడుతున్న ఆయన హైధరాబాద్ లోని అశోక్ నగర్లో గల తన స్వగృహంతో పరమపదించారు. దళిత, వామపక్ష ఉద్యమాలలో ఆయన కీలక పాత్ర పోషించారు. పోలీసులు జరిపిన ఎన్ కౌంటర్లపై కేసులో నమోదుచేసి విచారణ జరపాలంటూ పౌరహక్కుల నేత బొజ్జా తారకం సుప్రీంకోర్టులో పోరాడి గెలిచారు.
ప్రముఖ కవి బోయి భీమన్నకు బొజ్జా తారకం అల్లుడు. ఆయనకు భార్య విజయశాంతి, కుమారుడు రాహుల్ బొజ్జా, కుమార్తె మహిత ఉన్నారు. ఐఏఎస్ అధికారి అయిన తనయుడు రాహుల్ బొజ్జా ప్రస్తుతం హైదరాబాదు కలెక్టర్ గా పనిచేస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల వరకు సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఆయన భౌతికకాయాన్ని సందర్శకుల కోసం ఉంచనున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు అంత్యక్రియలు నిర్వహిస్తారు. బొజ్జా తారకం మృతికి తెలంగాణ సీఎం కేసీఆర్, వైఎస్సార్ సిపీ అధ్యక్షుడు జగన్ సహా పలువురు రాజకీయ ప్రముఖలు సంతాపం తెలిపారు. విరసం నేత వరవరరావు, 'కమిటీ రిలీజ్ ఆఫ్ పొలిటికల్ ప్రిజనర్స్' సభ్యుడు రవీంద్రనాథ్, ఇతర ప్రముఖులు బొజ్జా తారకం మృతిపై సంతాపం ప్రకటించారు.
1939లో తూర్పుగోదావరి జిల్లా కందికుప్ప, బొజ్జవారిపేటలో జన్మించిన తారకం చిన్ననాటి నుంచి తన వర్గ ప్రజల పక్షాన నిలిచాడు. కాకినాడలో లాయర్గా ప్రాక్టీస్ ప్రారంభించిన అనంతరం తన వర్గ ప్రజలకు ఎదురయ్యే సమస్యలపై ఆయన పోరాటాన్ని ప్రారంభించారు. అనాటి నుంచి ధళిత వర్గాల అభ్యున్నతికి పాటుపుతూ.. దళిత ప్రజల పక్షాన నిలిచారు. 1968లో విజయభారతిని వివాహం చేసుకున్నారు. ఆమె నిజామాబాద్లో ఉద్యోగం చేస్తుండడంతో కాపురాన్ని అక్కడికి మార్చారు. అనంతరం నిజామాబాద్లో పదేళ్లు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. 1978లో కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి శివశంకర్ వద్ద పనిచేశారు. నాలుగు దశాబ్దాలపాటు ప్రజా, న్యాయపోరాటాన్ని సాగించారు. చుండూరు, కారంచేడు, వేంపెంట, లక్ష్మీపేట బాధితులకు ఆయన ఆసరాగా నిలిచారు. మానవహక్కులు, దళిత, వామపక్ష ఉద్యమాల్లో కీలకపాత్ర పోషించారు.
అలాగే ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణళికకు శ్రీకారం చుట్టారు. భూస్వాములపై తిరుగుబాటు, అంటరానితనం నిర్మూలనే ధ్యేయంగా పనిచేశారు. నిజామాబాద్లో అంబేద్కర్ యువజన సంఘాన్ని స్థాపించారు. అనంతరం యువజన సంఘాన్ని హైదరాబాద్కు విస్తరించారు. ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ వ్యవస్థాపక అధ్యక్షుడిగానూ వ్యవహరించారు. ఎమర్జెన్సీ సమయంలో ఏడాదిన్నర పాటు చంచల్ గూడ జైలులో ఉన్నారు. పోలీసుల ఎన్కౌంటర్లపై సుప్రీంలో వాదించిన ఘనత సొంతం చేసుకున్న బొజ్జా తారకం రచయితగానూ తానేంటో నిరూపించుకున్నారు. ఆయన రాసిన ‘పోలీసులు అరెస్ట్ చేస్తే’ అనే పుస్తకానికి మంచి గుర్తింపు వచ్చింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more