ఆంధ్రప్రదేశ్ లో కాపు రిజర్వేషన్ల పోరు బాట మళ్లీ తెరపైకి వచ్చింది. కాపు ఐక్యవేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తమ డిమాండ్లను సాధించుకోవడానికి హైదరాబాద్లో పలువురు నేతల మద్దతు కూడ గట్టడానికి ప్రయత్నాలు జరుపుతూనే ఉన్నారు. మాజీ కేంద్ర మంత్రి దాసరి నారాయణరావు నివాసంలో ముద్రగడ ఆధ్వర్యంలో కాపు నేతలు సమావేశమయ్యారు.
అయితే భవిష్యత్ కార్యాచరణ కోసమే వీరంతా భేటీ అయినట్లు చెప్పటినప్పటికీ, కేవలం మర్యాద పూర్వకంగా ఐక్య ఉద్యమ నేత ముద్రగడ గౌరవార్థం లంచ్ కి మాత్రమే కాపు నేతలనంతా ఆహ్వానించినట్లు దాసరి అనంతరం మీడియాకు తెలిపారు. కాపు కీలక నేతలైన ముద్రగడతోపాటు చిరంజీవి, బొత్స, పల్లంరాజు, అంబటితో పాటు ఇతర కీలక నేతలు పాల్గొన్నారు.
కాపు రిజర్వేషన్ సాధన ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఒంటరివాడు కాదు అని చెప్పడానికే తామంతా దాసరి నివాసంలో ఏకమయ్యామని వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు తెలిపారు. ఇచ్చిన హామీనే నెరవేర్చమని చంద్రబాబును కోరుతున్నాం. కానీ, ఇంతవరకు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లేదు. అందుకే పోరాటానికి సిద్ధమౌతున్నామని ఆయన తెలిపారు. ఇన్నాళ్లూ ముద్రగడ ఒంటరిగా పోరాడారు.. కానీ, ఇకపై ఆయన వెంట కాపు సమాజం మొత్తం నడుస్తుంది.
వచ్చే నెల 11న అన్ని జిల్లాల కాపు నేతలతో భేటీ కానున్నట్లు కాపు ఉద్యమ నేత, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం తెలిపారు. ఆయన మంగళవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ కాపులను బీసీల్లో చేర్చేవరకూ తాము నిద్రపోయేది లేదని స్పష్టం చేశారు. ఎన్నికల హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిలబెట్టుకోవాలని ముద్రగడ డిమాండ్ చేశారు.
మరోవైపు ప్రముఖ దర్శక, నిర్మాత, కేంద్ర మాజీమంత్రి దాసరి నారాయణరావు మాట్లాడుతూ కాపులను బీసీల్లో చేర్చాలంటూ ఉద్యమం చేస్తున్న ముద్రగడ పద్మనాభానికి తామంతా వెన్నంటి ఉంటామన్నారు. పట్టువదలని విక్రమార్కుడిలా ముద్రగడ పోరాడుతున్నారని ఆయన అన్నారు. కాగా ఇవాళ దాసరి నివాసంలో ముద్రగడ పద్మనాభంతో పాటు ఇతర కాపు ప్రముఖులు సమావేశమైన విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more