సభ్య సమాజంలో వున్నామన్న ధ్యాస కూడాల లేని ఓ యువ్వన జంట.. నడిరోడ్డుపై రోమాన్స్ చేశారు. ఓక వైపు మితిమీరిన వేగంతో ప్రియుడు టూవీలర్ ను నడుపుతండగా.. మరోవైపు ప్రియురాలు మాత్రం అతనిపై ముద్దుల వర్షం కురిపించడంతో మునిగిపోయారు. తమిళనాడులోని వేలూరు కోటలోని మక్కన్ జంక్షన్ వద్ద పూర్తిగా మధ్యం మత్తులో వున్న వీరి ధాటికి బైక్ నడపలేకపోయిన ఓ వాహనదారుడు వారి ర్యాష్ డ్రైవింగ్ పై నిలదీశాడు. అంతే ప్రియుడి వాహనం నుంది దిగిన బెంగుళూరుకు చెందిన 29 ఏళ్ల యువతి అతన్ని నానా విధాలుగా దుర్భాషలాడింది.
దీంతో అతడితో పాటు మరికోందరు వాహనదారులు కూడా అయనకు మద్దతుగా నిలచి ప్రేమజంటపై విరుచుకుపడ్డారు. అయితేనేం వారందరికీ అమె ఒక్కతే సమాధానం చెప్పడం, అసభ్యపదజాలంతో దుర్భాషలాడటంతో వారి మధ్య పెద్ద రాద్ధాంతమే జరిగింది. ఇంతలో సమాచారం అందుకున్న స్థానిక ఎస్ ఐ రాజ్ కుమార్ అక్కడికి వచ్చి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. రంగంలోకి దిగన ఆయన యువతని సముదాయించేందుకు ప్రయత్నించారు.
దీంతో ఆగ్రహించిన యువతి ఎస్ఐ రాజకుమార్ ను కూడా దుర్భాషలాడింది. అతనిపై దాడికి కూడా యత్నించింది. అక్కడున్నవారందరూ తమనే చూస్తున్నారన్న ధ్యాసకూడా లేకుండా ప్రియుడిని ముద్దుపెట్టుకుంటూ హంగామా సృష్టించింది. దీంతో వారిని ఉత్తర వెల్లూర్ పోలీసు స్టేషన్ కు తరలించిన ఎస్ఐ వీరిపై ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. పోలీస్ స్టేషన్ లోనూ ప్రేమజంట నానా హంగామా చేసింది. అక్కడున్న మహిళా ఎస్ఐ నిర్మలపై కూడా అసభ్యపదజాలంతో దూషించింది. ఆమె ప్రియుడు ఫర్నీచర్ ధ్వంసం చేశాడని పోలీసులు తెలిపారు
దీంతో ప్రేమజంటపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిపై 294 సెక్షన్ కింద, 353 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. బెంగళూరు నుంచి తమిళనాడుకు అతిధిగా వచ్చిన అర్చన చివరకు అతి చర్యలు వెకిలి చేష్టలతో కటకటాలపాలైంది. తమిళనాడు తుత్తిపట్టుకు చెందిన వివకానందన్ తో డేటింగ్ కోసం వచ్చిన అర్చన అడ్డంగా బుకైంది. దీంతో అమెను న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టంగా అమెకు రెండు వారాల పాటు రిమాండ్ విధించినట్లు సమాచారం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more