దేశ రాజధానిలో అత్యాచారాలకు రాజధానిగా మారింది. వారం రోజుల క్రితం జార్ఖంగ్ కు చెందిన ఇద్దరు యువతులను మత్తుపదార్థాలిచ్చి ముగ్గురు సామూహిక అత్యాచారాలకు తెగబడిన ఘటనను మరువక ముందే మరో దారుణం జరిగింది. ప్రతిష్ఠాత్మకమైన జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఓ పీహెచ్డీ విద్యార్థినికి డ్రగ్స్ ఇచ్చి, హాస్టల్ గదిలోనే అత్యాచారం చేశారు. అమ్మాయిపై కన్నేసిన కామాంధుడు అమెను మాయమాటలతో వంచించి తన గదికి తీసుకెళ్లి అమెపై అత్యాచారం చేశాడు.
వివరాల్లోకి వెళ్తే.. ఫేస్ బుక్ లో పరిచయం అయిన అన్మోల్ రతన్ అనే ఆ విద్యార్థి.. తాను చూడాలనుకుంటున్న సినిమా ఉందని మెసేజ్ ఇచ్చాడని, తనతో పాటు బ్రహ్మపుత్ర హాస్టల్కు రావాల్సిందిగా కోరాడని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. అంతకుముందు ఆమె ఎవరిదగ్గరైనా ఆ సినిమా ఉందా అని ఫేస్బుక్లో మెసేజ్ పెట్టడంతో అతడు తన దగ్గర ఉందని చెప్పాడు. పెన్డ్రైవ్లోకి సినిమా కాపీ చేసుకోడానికి తాను అన్మోల్ రతన్ గదికి వెళ్లినప్పుడు అతడు తనకు మత్తుమందు కలిపిన డ్రింక్ ఇచ్చాడని బాధితురాలు ఫిర్యాదుచేసింది.
కాసేపటికే తాను స్పృహ కోల్పోయానని, తాను స్పృహలో లేనప్పుడే అతడు తనమీద అత్యాచారం చేశాడని తెలిపింది. తనకు మెలకు వచ్చిన తర్వాత గట్టిగా అరిచేందుకు ప్రయత్నించానని, కానీ రతన్ తన నోరు నొక్కేశాడని చెప్పింది. జరిగిన విషయం గురించి ఎవరికైనా చెబితే బాగోదంటూ ఆలిండియా స్టూడెంట్స్ అసోసియేషన్కు చెందిన అతడు బెదిరించాడు. ఎట్టకేలకు ఆమె వసంత్ కుంజ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, వాళ్లు 376, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాధితురాలిని వైద్యపరీక్షలకు పంపారు. ఎఫ్ఐఆర్ దాఖలు కాగానే ఏఐఎస్ఏ రతన్ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దుచేసింది. అయితే ఈ వ్యవహారంపై తనకు ఫిర్యాదు ఏమీ రాలేదని జేఎన్యూ రిజిస్ట్రార్ ప్రమోద్ కుమార్ తెలిపారు. యూనివర్సిటీకి ఎలాంటి ఫిర్యాదు అందలేదని, యూనివర్సిటీ సెక్యూరిటీ విభాగాన్ని కూడా తాను అడగ్గా వాళ్ల నుంచి ఎలాంటి సమాచారం అందలేదని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more