వాచీ, కారు, యోగా, ముద్దులు కాదేదీ వివాదానాకి అతీతం. ఇది ఒక్క కర్ణాటక సీఎం సిద్ధరామయ్య విషయంలోనే మనం బాగా గమనించవచ్చు. ఎప్పుడు ఏదో ఒక వివాదంలో ఉండే ఈ ముఖ్యమంత్రి సాబ్ ఇప్పుడు మరోసారి కాస్త గట్టిదైన దాంట్లోనే చిక్కుకున్నాడు.
పఠాన్ కోట్ ఉగ్రదాడిలో అసువులు బాసిన లెఫ్టినెంట్ కల్నల్ నిరంజన్ కుమార్ కుటుంబం రోడ్డు మీద పడటానికి ఇప్పుడు సిద్ధరామయ్య తీసుకున్న ఓ నిర్ణయం కావటం వివాదానికి తెరతీసింది. ఇటీవలి వర్షాలకు బెంగళూరు నగరాన్ని వరద నీరు ముంచెత్తిన తరువాత, కదిలిన సిద్ధరామయ్య సర్కారు నీటి కాలువలకు అడ్డుగా ఉన్న 1,100 గృహాలను యుద్ధ ప్రాతిపదికన కూల్చి వేయాలని నిర్ణయించింది. ఇందులో నిరంజన్ కుమార్ ఇల్లు కూడా ఉంది.
"నా సోదరుడిని కోల్పోయాను. ఇప్పుడు ఇంటిని కూడా కోల్పోవాల్సి వస్తోంది. ఇంటి కూల్చివేతను ఆపాలని కోరుకుంటున్నాను. ఈ దేశం కోసం మా సోదరుడు ప్రాణాలు అర్పించినందుకు ఇదేనా మాకిస్తున్న బహుమానం." అంటూ నిరంజన్ సోదరుడు శశాంక్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
ఇదే విషయమై సివిల్ కమిషన్ మంజునాథ ప్రసాద్ స్పందిస్తూ, "వారి పట్ల నాకు సానుభూతి ఉంది. అయితే, ప్రజల కోసం ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. మనసుకు కష్టమనిపించినా కూల్చివేత తప్పదు" అని చెప్పటం గమనార్హం. నిరంజన్ బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ లో విధులు నిర్వహించేవాడు. జనవరి 2న పాక్ ప్రేరేపిత జైషే మహమ్మద్ ఉగ్రవాదులు పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై దాడి చేయగా, ఆపై వారు విసిరిన పేలని గ్రనేడ్ ను నిర్వీర్యం చేస్తూ, ప్రాణాలు వదిలిన సంగతి తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more