ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన తర్వాతే జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్వ్యవస్థీకరణపై దృష్టి సారించాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. జిల్లాల ఏర్పాటుపై పదో తేదీన ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసే దిశగా అడుగులు వేస్తోంది. గజ్వేల్లో మిషన భగీరథను ప్రధానమంత్రి ఆదివారం(7వ తేదీ) ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా జరిగే కార్యక్రమంలో కొత్త జిల్లాలు, వాటికి కావాల్సిన నిధులు, అధికారులపై ప్రధానిని కోరాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నారు. ఆ తర్వాతే జిల్లాలపై దృష్టిసారించాలని భావిస్తున్నారు.
ముందుగా ఈ నెల 4 లేదా 10వ తేదీల్లో ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేయాలని సర్కారు యోచించింది. అయితే.. 4వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయలేదు. దీంతో కొత్త జిల్లాలపై ఈ నెల 10న ప్రాథమిక నోటిఫికేషన్ వెలువడుతుందని రెవెన్యూ వర్గాల అంటున్నాయి. ఈ నెల 9వ తేదీన కలెక్టర్లు, విభాగాధిపతులు, భూపరిపాలన ప్రధాన కమిషనర్(సీసీఎల్ఏ), రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారని అధికార వర్గాల సమాచారం.
చకచకా కసరత్తు కొత్త జిల్లాల ఏర్పాటుకు ఇప్పటికే ముసాయిదా విడుదలైన నేపథ్యంలో జిల్లాస్థాయి శాఖలన్నీ శాఖల పునర్వ్యవస్థీకరణపై దృష్టి సారించాయి. శాఖలను, ఉద్యోగులను ఏ విధంగా విభజించాలి... సర్దుబాటు వంటి అంశాలపై కసరత్తు చేస్తున్నాయి. వరంగల్ జిల్లాలో మహబూబాబాద్ను జిల్లా చేయడానికి ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం వ్యక్తం చేసింది. దాంతో ఆ పట్టణంలో ప్రతిపాదిత కలెక్టరేట్ భవనానికి రోడ్డు పనులకు ఇటీవలే టెండర్లు కూడా పిలిచారు. మరోవైపు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలను కలిపి మూడు జిల్లాలు చేయడానికే ప్రభుత్వం మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.
రంగారెడ్డి పేరుతో వికారాబాద్ జిల్లా కేంద్రంగా ఒక జిల్లా మాత్రమే చేయనున్నారు. జిల్లా ప్రజాప్రతినిధులంతా జిల్లా యూనిట్గా మూడు జిల్లాలు చేయాలని బలంగా పట్టుబడుతున్నారు. ఇటీవలే టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్, ఎంపీ కె.కేశవరావుతో కూడా చర్చించారు. అయితే వీటిని తోసిపుచ్చుతూ హైదరాబాద్, సికింద్రాబాద్ జిల్లాలపై సమగ్రంగా మ్యాపులు సిద్ధం చేయాలని రెవెన్యూశాఖ జిల్లా యంత్రాంగాలను ఆదేశించింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగితే శాఖలను, ఉద్యోగులను ఏ విధంగా విభజించాలి... సర్దుబాటు వంటి అంశాలపై మెదక్, నిజామాబాద్ జిల్లా కలెక్టర్లు ఇచ్చిన నివేదికల ఆధారంగా ప్రభుత్వం శాఖలకు సూచనలు చేసింది.
రాష్ట్రంలో 13 కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత ప్రతిపాదనల్లో ఉన్న సిరిసిల్ల జిల్లాను ముసాయిదా నుంచి తొలగించింది. కొత్తగా తెరపైకి వచ్చిన నిర్మల్ జిల్లా ఏర్పాటు అంశాన్ని సైతం పక్కకు పెట్టింది. దీంతో ప్రస్తుత మున్న పది జిల్లాలకు అదనంగా మంచిర్యాల (కొమురంభీం), జగిత్యాల, భూపాలపల్లి (ఆచార్య జయశంకర్), మహబూబాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వనపర్తి, నాగర్ కర్నూల్, సూర్యాపేట, యాదాద్రి(భువనగిరి), కొత్తగూడెం, సికింద్రాబాద్ కొత్త జిల్లాలుగా ఏర్పడుతాయి. ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా ఉన్న రంగారెడ్డి జిల్లాను వికారాబాద్ కేంద్రంగా పునర్వవ్యస్థీకరించింది. కొత్త జిల్లాల ఏర్పాటుతో పాత జిల్లాల భౌగోళిక స్వరూపంలో మార్పులు చోటు చేసుకున్నాయి. అందుకు వీలుగా మొత్తం 23 జిల్లాలు.. వాటి పరిధిలోకి వచ్చే మండలాల జాబితాతో డ్రాఫ్ట్ నోటిఫికేషన్ను ప్రభుత్వం సిద్ధం చేసింది. కొత్తగా 74 మండలాలను ఏర్పాటు చేయనుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more