తనతోపాటు 432 మంది విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలని కోరుకున్న ఓ 8వ తరగతి విద్యార్థి దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కర్ణాటకకు చెందిన 13 ఏళ్ల దివిత్ రాయ్ చేసిన పనికి ఏకంగా ఆ రాష్ట్ర హోం మంత్రి దిగి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంతకీ ఆ బాలుడు ఏం చేశాడు... ఎందుకు చేశాడు? అన్నది పరిశీలిస్తే...
కర్ణాటక ప్రభుత్వం ఈ మధ్యే టీచర్ల రేషనలైజేషన్ ప్రక్రియ చేపట్టింది. ఇందులో భాగంగా దక్షిణ కన్నడ జిల్లా, హరది గ్రామంలోని ఓ ప్రాథమికోన్నత పాఠశాలలో నలుగురు టీచర్లను వేరే స్కూల్ కి బదిలీ చేశారు. అయితే ఇంత కాలం తమకు విద్యాబుద్ధులు అందించిన గురువులు తమను వీడి వెళ్తున్నారన్న విషయాన్ని అదే స్కూల్లో చదువుతున్న దివిత్ రాయ్ తట్టుకోలేకపోయాడు. వారిని వెళ్లొద్దంటూ బతిమిలాడాడు. అదంతా ప్రభుత్వం చేతుల్లో ఉన్న వ్యవహారమని, తమ చేతుల్లో ఏం లేదని వారంతా అతనికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ, మొండిపట్టు ఉన్న ఆ పిల్లాడు అస్సలు వదల్లేదు.
హోంమంత్రి కార్యాలయం ప్రజలతో మమేకం అయ్యేందుకు ఒక ఫోన్ నంబర్ అందుబాటులో ఉంచారని విన్నాడు. అంతే ఒక వాయిస్ మెసేజ్ ను ఆ నంబర్ కు పంపాడు. “I’m the home minister of my school council. Can I speak to you for five minutes?” (‘మా పాఠశాల కౌన్సిల్కు నేనూ హోం మినిస్టర్నే. నేనో ఐదు నిమిషాలు మీతో మాట్లాడవచ్చా?’ ) అంటూ అందులో పేర్కొన్నాడు. ఆ సందేశం అందుకున్న మంత్రిత్వ శాఖ విషయాన్ని మంత్రి పరమేశ్వరకు చేరవేశారు. మంత్రి ఆదేశాల మేరకు వెంటనే ఆయన కార్యాలయం నుంచి దివిత్ కి ఫోన్ వచ్చింది. ‘సర్ మా టీచర్లను బదిలీ చేయాలని మీరు తీసుకున్న నిర్ణయం నాతోసహా ఎంతో మంది విద్యార్థులకు నష్టం కలిగిస్తుంది. టీచర్లు వెళ్లిపోతే దాని ప్రభావం పిల్లల చదువులపై కూడా పడుతుంది. దయచేసి బదిలీలను ఆపివేయండ’ని కోరాడు.
పూర్తి విషయం అవగాహనకు వచ్చిన మంత్రి వెంటనే తానే స్వయంగా విద్యాశాఖ మంత్రికి తన్వీర్ కు ఫోన్ చేసి వెంటనే ఆ ఆదేశాలను నిలిపేలా చూడాలని కోరాడు. వ్యవహారం మీడియాలో హైలెట్ కావటంతో స్థానిక ఎమ్మెల్యే కూడా పాఠశాలను సందర్శించి విద్యాశాఖ అధికారితో మాట్లాడి ఆదేశాలను నిలుపుదల చేసేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చాడు. చివరికి ఏదైతేనేం ఆ నలుగురి టీచర్ల బదిలీ ఆపేసిన ప్రభుత్వం వారిని అదే పాఠశాలలో కొనసాగుతారని తెలిపింది.
‘తన చదువుపట్ల, తోటివారి భవిష్యత్తుపట్ల దివిత్కు ఉన్న దృక్పథం పట్ల అధికారులు, విద్యార్థల తల్లిదండ్రులు అభినందనలు తెలుపుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more