కాంగ్రెస్ పార్టీ యువనేత రాహుల్ గాంధీకి సర్వోన్నత న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పై ఆయన చేసిన అరోపణల నేపథ్యంలో వారికి బేషరుతుగా క్షమాపణలు చెబుతావా.? లేక కోర్టు విచారణను ఎదుర్కోంటావా..? ఏదో ఒకటి తేల్చిచెప్పాలని అత్యున్నత న్యాయస్థానం రాహుల్ గాంధీకి సూటిగా ప్రశ్నించింది. ఒక సంస్థలోని అందరి వ్యక్తులను అపాదించేలా వ్యాక్యలు చేయడం సబబు కాదని, ఇంత పెద్ద దోషాన్ని ఒక సంస్థపై ఎలా మోపుతావని సుప్రీంకోర్టు ధర్మాసానం ప్రశ్నించింది.
2014 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా భివాండీలో జరిగిన బహిరంగ సభలో రాహుల్ అర్ఎస్ఎస్ వాదులే అప్పట్లో మహాత్మగాందీని చంపారు.. ఇప్పుడు వారే గాంధీ, సర్ధార్ వల్లభభాయ్ పటేల్ లను కీర్తిస్తున్నారంటూ చేసిన వ్యాఖ్యలపై ఆర్ఎస్ఎస్ వాదులు కోర్టులో క్రిమినల్ కేస్ దాఖలు చేశారు. అయితే తనపై అర్ఎస్ఎస్ దాఖలు చేసిన క్రిమినల్ కేసును కోట్టివేయాలని రాహుల్ గాంధీ అత్యున్నత న్యాయస్థానాన్ని అశ్రయించడంతో.. ఈ పిటీషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం ఇవాళ అయనను క్షమాపణలు చెబుతారా..? లేక విచారణను ఎదుర్కోంటరా..? తేల్చిచెప్పండీ అంటూ అదేశించింది.
రాహుల్ గాంధీ తరపు న్యాయవాది ఇవి చరిత్రక సత్యాలని, ప్రభుత్వ రికార్డులోనూ ఇవి ఉన్నాయని చెప్పబోయారు. ఆ తరువాత ఈ కేసును కనీసం రెండు వారాల పాటు వాయిదా వేయాలని రాహుల్ కోరారు. తన తరపు న్యాయవాది కపిల్ సిబాల్ అప్పటి వరకు అందుబాటులో వుండని కారణం చేత రెండు వారాలు గడవు ఇవ్వాల్సిందిగా కోరారు. అయితే అప్పటి వరకు కేసును వాయిదా వేయడం కుదరదని చెప్పిన సర్వోన్నత ధర్మాసనం.. ఈ నెల 27కు కేసును వాయిదా వేసింది. దీంతో రాహుల్ గాంధీ న్యాయస్థానంలో విచారణను ఎదుర్కోంటరా..? లేక క్షమాఫణలు చెబుతారా..? అన్న ఉత్కంఠ పార్టీ వర్గాల్లో నెలకొంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more