కర్ణాటక పోలీసు అధికారులతో వైరం పెట్టుకుని వారి వేధించారన్న అరోపణలతో మరో మంత్రి తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవల బళ్లారీకి చెందిన డిఫ్యూటీ ఎస్పీ అనుపమా షెనాయ్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో మంత్రి పరమేశ్వర్ నాయక్ పై అనంతరం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య వేటు వేటు వేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరో డీఎస్సీ గణపతి అత్మహత్య కేసులో బెంగుళూరు అభివృద్ది శాఖ మంత్రి కేజే జార్జి తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.
కర్నాటక డిప్యూటీ ఎస్పి ఎం.కె.గణపతి ఆత్మహత్య కేసులో అరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి జార్జిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాల్సిందిగా మడికెరి కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. గణపతి ఆత్మహత్య ఘటనపై ఆయనతోపాటు ఇద్దరు ఐపీఎస్ అధికారులు ఏఎం ప్రసాద్, ప్రణబ్ మొహంతిలపై కూడా ఎఫ్ఐఆర్ నమోదుచేయాలని కొడగు పోలీసులను మడికెరి అదనపు ఫస్ట్క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ అన్నపూర్ణేశ్వరి ఆదేశించారు.
ఈ నెల ఏడో తేదీన ఓ హోటల్లో ఆత్మహత్య చేసుకున్న గణపతి.. తాను రాసి పెట్టుకున్న సూసైడ్ నోట్లో మంత్రి జార్జి, ఐపీఎస్ అధికారులు ఏఎం ప్రసాద్, ప్రణబ్ మొహంతి తనను వేధిస్తున్నారని ఆరోపించడం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఆత్మహత్యకు ముందు ఒక ప్రైవేట్ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంత్రి సహా ఇద్దరు పోలీసు శాఖ ఉన్నతాధికారుల తనను వేధిస్తున్నారని, తనకేం జరిగినా మంత్రి జార్జి, ఇద్దరు ఐపీఎస్ అధికారులదే బాధ్యత అని గణపతి ఆరోపించారు. అ ఇంటర్వ్యూ ఇచ్చిన వెంటనే ఆయన ఆత్మహత్య చేసుకుని మరణించారు.
ఈ ఘటనపై కేసు నమోదు కోసం ఈ నెల 10న కుషాలనగర్ పోలీస్స్టేషన్కు వెళితే పోలీసులు అందుకు నిరాకరించారని గణపతి భార్య పవన, కుమారుడు నెహల్ పిటిషన్లో పేర్కొన్నారు. ఉన్నత స్థానాల్లో ఉన్న నిందితులు కేసు దర్యాప్తును ప్రభావితం చేయగలరని, వారిపై ఐపీసీలోని 306, 34 సెక్షన్ల ప్రకారం క్రిమినల్ కేసులు నమోదుచేయాలని కోరారు. నెహల్ తరఫున వాదించిన న్యాయవాది ఎంటీ నానయ్య మాట్లాడుతూ ఈ కేసు దర్యాప్తు అధికారులు జార్జి, ఇద్దరు ఐపీఎస్ అధికారులను ప్రశ్నించాల్సి ఉంటుందన్నారు. వారి దర్యాప్తుతో సంబంధం లేకుండా నిందితుల అరెస్ట్పై నిర్ణయం తీసుకోవాలన్నారు.
దీంతో తన తండ్రి ఆత్మహత్యకు కారణమైన అధికారులు, మంత్రిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గణపతి కుమారుడు నెహల్ గణపతి దాఖలుచేసిన ప్రైవేట్ పిటిషన్ను విచారణకు మేజిస్ట్రేట్ విచారణకు స్వీకరించారు. మేజిస్ట్రేట్ ఆదేశాల తర్వాత అసెంబ్లీలో విపక్ష నేత, బీజేపీ నాయకుడు జగదీశ్షెట్టర్ స్పందిస్తూ జార్జి తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని అన్నారు. ఈ కేసు నిష్పక్షపాత దర్యాప్తు కోసం ప్రభుత్వం సదరు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more