కేరళ యువత ఉగ్రవాదం పైపు అకర్షితులవుతున్నారన్న వార్తలు నిజమయ్యాయి. గత కొన్ని రోజులుగా దాదాపు 15మంది యువకులు కనిపించకుండా పోయారని, వారంతా ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ లో చేరుతున్నారని వార్తలు రావడంతో కలకలం రేగింది. అయితే ఈ వార్తల్లో నిజం లేదని తమ పిల్లలు అలాంటి వారు కాదని వాదించిన వారి తల్లిదండ్రుల అశలు అడియాశలయ్యాయి. మిస్పింగ్ యువకులంతా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదానికి అకర్షితులై అందులో చేరారన్న వార్తలు బలపడ్డాయి.
ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన పోలీసు బృందాలు 23 ఏళ్ల మహ్మద్ మార్వాన్ అనే యువకుడి కుటుంబాన్ని సంప్రదించింది. కుటుంబ సభ్యులు పోలీసులకు తమ కుమారుడు పంపించిన సందేశాన్ని చూపిస్తూ మొబైల్ ఫోన్ అందించారు. తాను పశ్చిమాసియాలో ఉన్నానని పేర్కొంటూ మార్వాన్ జూన్ చివరి వారంలో ఆ మెస్సేజ్ పంపించాడని కుటుంబ సభ్యులు చెప్పారు. ఇస్లామిక్ స్టేట్ తో తన పని పూర్తయ్యాక కచ్చితంగా తిరిగొస్తానని కూడా చెప్పినట్లు తెలిసింది.
మహ్మద్ మార్వాన్ తల్లిదండ్రులకు పంపిన సందేశంలో ఉగ్రవాద సంస్థలో వారు చేసినట్లు స్పష్టంగా పేర్కోన్నాడు. 'ప్రజలు ఇక నన్ను ఉగ్రవాదినని పిలుస్తారు కావొచ్చు. అల్లా అడుగు జాడల్లో నేను చేసే పోరాటం ఉగ్రవాదమే అయితే.. అవును నేను ఉగ్రవాదిననే ఒప్పుకుంటాను. ఇది నా మతాన్ని నేను కాపాడుకునేందుకు చేసే పోరాటం' అని కేరళలో గత కొద్ది రోజులుగా కనిపించకుండా పోయిన ఓ యువకుడు తన కుటుంబ సభ్యులకు మెస్సేజ్ పంపించాడు. దీంతో పోలీసులు కేరళ యువతపై నిఘా పెట్టారు. యువతలో మరెవ్వరూ కూడా ఉగ్రవాదం పైపు అకర్షితులు కాకుండా తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలని వారిని నిత్యం పర్యవేక్షించాలని డిమాండ్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more