కంటి చూపుతో చంపేస్తానన్న డైలాగ్ విన్నాం కానీ, ఉల్లిపాయతో ఓ కసాయి తన కన్న కూతర్నే చంపాశాడు. అదేంటి తల్లి చేయని మేలు కూడా ఉల్లి చేస్తుందని నానుడి. అలాంటి నానుడిని తిరగరాస్తూ.. ఓ ఉల్లి అరేళ్ల చిన్నారికి నిండు నూరేళ్లు నిండేలా చేసింది. ఇది నిజం. ఓ కసాయి తండ్రి తన కూతురు అంగ్ల అక్షరాలను క్రమబద్దంలో చెప్పకపోవడంతో విధించిన శిక్షతో చిన్నారి జీవితం అర్థాంతరంగా చిదిమేశాడు. ఇటువంటి దుర్ఘటన మహారాష్ట్రలోని బేలాపూర్ అనే గ్రామంలో జరిగింది.
ఆరేళ్ళ అమాయకురాలి పాలిట ఆమె తండ్రే కాలయముడయ్యాడు. ఈ నెల 9న జరిగిన ఈ దుర్ఘటనపై పోలీసులు తెలిపిన సమాచారం తీవ్ర ఆవేదన కలిగిస్తోంది. ఒకటి నుంచి 15 వరకు అంకెలను వరుసగా చెప్పలేకపోయినందుకు చిన్నారి తండ్రి ఆమె నోట్లో ఉల్లిపాయ కుక్కాడు. ఆమెకు ఊపిరాడక ప్రాణాలొదిలితే గుట్టు చప్పుడు కాకుండా గ్రామంలోని శ్మశానంలో అంత్యక్రియలు చేసేశారు. రెండు రోజుల తర్వాత ఆ చిన్నారి తల్లి గుండె ధైర్యాన్ని చిక్కబట్టుకుని పోలీసులకు తన భర్తపై ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగు చూసింది.
సంజయ్ కూటే (32) కుమార్తె భారతి. ఆమెను గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఒకటో తరగతిలో చేర్పించారు. సంజయ్ లేబర్గా పనిచేస్తూ ఉంటాడు. శనివారం రాత్రి తన కుమార్తె ఎలా చదువుతోందోనని పరీక్ష చేశాడు. 1 నుంచి 15 వరకు అంకెలు చెప్పమన్నాడు. ఆమె 12ను మరచిపోయింది. దీంతో సంజయ్ తీవ్ర ఆగ్రహంతో ఆమెను చెంపదెబ్బ కొట్టాడు. చిన్నారి ఏడుస్తూ ఉండటంతో నోట్లో ఉల్లిపాయ కుక్కాడు. దీంతో ఆ పాప ఊపిరాడక కుప్పకూలిపోయింది. స్పృహ కోల్పోయింది. సంజయ్ ఆ బాలికను సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్ళాడు. ఆమె మరణించిందని డాక్టర్లు చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more