మీ పిల్లలకు మొబైల్ ఫోన్ ఇస్తున్నారా..? పాఠశాలలకు, కాలేజీలకు మొబైల్ ఫోన్లను అనుమతించడం లేదు.. కాబట్టి వాటిని ఇచ్చే తరుణంలో కాస్త జాగ్రత్త. ఎందుకంటే అవి వాడుతూ మీ పిల్లలు టీచర్లకు పట్టుబడితే.. ఇక మీకు పాఠశాలకు వెళ్లి ప్రధానోపాధ్యాయురాలిని కలవాల్సిందే. అలా కాదు మా వాడు ఇంజనీరింగ్ చేస్తున్నాడు. అందుకనే వాడికి సెల్ ఫోన్ ఇచ్చామని అంటున్నారా..? అయితే తరగతి గదుల్లో సెల్ ఫోన్ మాట్లాడితే.. మీ జేబులకు చిల్లులు పడటం ఖాయం. అదెలా అంటారా..?
తరగతి గదిలో సెల్ఫోన్లో మాట్లాడితే రూ.10వేలు జరిమానాగా విధించనున్నట్లు గిండి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులకు హెచ్చరికలు జారీ చేసింది. శాస్త్రీయ అభివృద్ధిలో ఒక భాగంగా భావించపడే సామాజిక మాధ్యమాలు యువతరాన్ని ముఖ్యంగా విద్యార్థులను తన కబంధ హస్తాలతో బందీలను చేస్తున్నాయని చేతిలో పాఠ్య పుస్తకాలు ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా విద్యార్థుల వద్ద సెల్ఫోన్ ఉండాల్సిందే. సెల్ఫోన్కు దాసులైన విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నారు. అంతేకాక వారి చెడు మార్గాలను అనుసరిస్తున్నట్లు పలు సర్వేల్లో తెలిసింది.
ఈ నేపథ్యంలో విద్యార్థులను మంచి మార్గంలో నడిపించడానికి చదువుకునే సమయంలో వారి ఏకాగ్రత దెబ్బతినకుండా ఉండేందుకు పాఠశాల, కళాశాల నిర్వాహకులు పలు రకాల నిబంధనలు విధించాయి. గిండి ఇంజినీరింగ్ కళాశాలలో తరగతి గదుల్లో సెల్ఫోన్లు ఉపయోగించరాదని, ఒక వేళ మాట్లాడితే వారికి రూ.10వేలు జరిమానా విధిస్తామని నిర్వాహకులు తెలిపారు. నిర్వాహకులు మాట్లాడుతూ విద్యార్థుల క్షేమం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. విద్యార్థుల నుండి ఈ నిబంధనకు ఆదరణ లభించిందని అన్నారు. ఎవరైనా పట్టుబడి జరిమానా చెల్లించినట్లయితే ఆ సొమ్మును పేద విద్యార్థుల ఫీజులకు ఉపయోగిస్తామన్నారు. వారంలో రెండు రోజులు విద్యార్థులకు దీనిపై కౌన్సెలింగ్ ఇస్తామని తెలిపారు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more