దేశ రాజధాని ఢిల్లీలో బీజేపి కనివిని ఎరుగని రీతిలో ఓటమి పాలైనందుకు గాను ప్రతికారం తీర్చుకుంటుంది. అసలు దేశానికి నరేంద్రమోడీ ప్రధానిగా వున్నారా.? లేక ఢిల్లీకి మాత్రమే ప్రధానిగా వున్నారా..? అన్నది అర్థం కానీ ప్రశ్న. నిత్యం ఢిల్లీలోని అప్ ప్రభుత్వంపై తన అధిపత్యం చాటుకునేందుకు కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రయత్నం సాగిస్తుంది. ఇదే ఢిల్లీలో కేంద్రమంత్రి అరుణ్ జైట్లీకి సంబంధించిన డిడిసీఏ కేసులో ఆయనకు అనుకూలంగా చర్యలు తీసుకోవడంలో సఫలమైన కేంద్ర ప్రభుత్వం.. అవినీతి పేరు చెప్పి తమ అధికారులను అరెస్టు చేయడం ఎంత వరకు సమంజసం. ఇది అప్ ఢిఫ్యూటీ ముఖ్యమంత్రి మనీస్ సిసోడియా కేంద్రప్రభత్వంపై చేసిన అరోపణలు.
ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యకార్యదర్శి రాజేంద్ర కుమార్ సహా ఐదుగురిని సీబీఐ అవినీతి కేసులో అరెస్ట్ చేయడంపై అప్ నేతలు భగ్గుమంటున్నారు. ఒక ప్రైవేటు కంపెనీకి రూ. 50 కోట్ల విలువైన ప్రభుత్వ కాంట్రాక్టులను అప్పగించటంలో అక్రమంగా వ్యవహరించారన్న ఆరోపణలపై రాజేంద్రకుమార్ తదితరులను సీబీఐ అరెస్ట్ చేయడంతో ఇది కేవలం ప్రతికార చర్యలు మాత్రమేనని, అయితే వీటిన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారని, ఇక మీదట జరిగే ఎన్నికలలో బీజేపికి తమ తీర్పుతోనే ప్రజలు తీర్పునిస్తారని అన్నారు. ‘మోదీ గారూ, మాకు కేవలం ప్యూన్లు మాత్రమే మిగిలేలా చేసినా.. వారితో మేం ప్రభుత్వాన్ని నడుపుతాం’ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అన్నారు.
కేజ్రీవాల్ కార్యాలయంలో ఉప కార్యదర్శిగా పనిచేస్తున్న తరుణ్శర్మ, మరో ముగ్గురు ప్రైవేటు వ్యక్తులతో పాటు రాజేంద్రకుమార్ను కూడా సోమవారం ఉదయం విచారణ నిమిత్తం సీబీఐ ప్రధాన కార్యాలయానికి పిలిపించారు. మధ్యాహ్నం వరకూ వారిని ప్రశ్నించిన తర్వాత.. రాజేంద్రకుమార్, తరుణ్శర్మలతో పాటు రాజేంద్ర సన్నిహితుడు అశోక్కుమార్, ప్రైవేటు సంస్థ యజమానులు సందీప్కుమార్, దినేశ్గుప్తాలను అరెస్ట్ చేయాలని సీబీఐ నిర్ణయించింది. ఎండీవర్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ప్రైవేటు సంస్థ గత కొన్ని సంవత్సరాలుగా ఢిల్లీ ప్రభుత్వ టెండర్లు ఐదింటిని దక్కించుకోవటానికి అనుకూలంగా వ్యవహరిస్తూ రాజేంద్రకుమార్ తన అధికారాలను దుర్వినియోగం చేశారని గత ఏడాది డిసెంబర్లో సీబీఐ కేసు నమోదుచేసింది. నిందితులు నేరపూరిత కుట్రలో చేరి ఢిల్లీ ప్రభుత్వానికి 2007- 2015 మధ్య కాంట్రాక్టుల కేటాయింపులో రూ. 12 కోట్ల మేర నష్టం కలిగించారని ఆరోపించింది.
నిందితులైన అధికారులు ఆ కాంట్రాక్టు కేటాయించే క్రమంలో రూ. మూడు కోట్లకు పైగా అనుచిత లబ్ధి పొందారనీ ఆరోపించింది. అరెస్టు చేసిన నిందితులను మంగళవారం కోర్టు ఎదుట హాజరుపరుస్తామని సీబీఐ తెలిపింది. ఈ పరిణామాలపై సిసోడియా స్పందిస్తూ.. ‘సీఎం ఆఫీసును స్తంభింపజేసే కుట్ర జరుగుతోంది. సీఎం ముఖ్యకార్యదర్శి, ఉప కార్యదర్శులను అరెస్ట్ చేశారు. సహాయ కార్యదర్శిని అండమాన్కు బదిలీ చేశారు. ఇదంతా కేవలం ఒక్క రోజులో జరిగింది. ఢిల్లీలో 1991లో ఒక ఎన్నికైన ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచీ.. కేంద్ర ప్రభుత్వం దిగజారిన అత్యంత అధమ స్థాయి ఇదే’ అని అన్నారు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more