అమరావతి నుంచే పాలన కొనసాగించాలన్న ఏపీ ప్రభుత్వ పట్టుదల ఫలించింది. నవ్యాంధ్ర లో తాత్కాలిక సచివాలయం బుధవారం ప్రారంభమయ్యింది. అమరావతిలోని వెలగపూడిలో సెక్రటేరియేట్ భవనానికి కాసేపటి క్రితం వేద మంత్రాల నడుమ ప్రారంభించారు. మధ్యాహ్నం 2.59 నిమిషాలకు లాంఛనంగా ప్రారంభమయ్యింది. దీంతో సాంకేతికంగా పాలన ప్రారంభించాలన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయం అమలయినట్లు అయ్యింది. మొదటి దశలో తాత్కాలిక సచివాలయానికి వెళ్లనున్న వైద్య ఆరోగ్యశాఖ, గృహ నిర్మాణ శాఖ, కార్మిక శాఖ, పంచాయతీరాజ్ శాఖల కార్యాలయాలను సంబంధిత శాఖల మంత్రులు ప్రారంభించారు.
ఐదో బ్లాక్ ను ప్రారంభించిన అయ్యన్నపాత్రుడు పంచాయితీ రాజ్ కార్యాలయానికి పూజలు నిర్వహించాడు. అనంతరం ఆయన సమక్షంలో ఉద్యోగులు తమ విధులను లాంఛనంగా ప్రారంభించారు. త్వరలో పూర్తి స్థాయిలో పాలన ఇక్కడి నుంచే కొనసాగిస్తామని అధికారులు చెబుతున్నారు.
సెక్రటేరియట్ ఏర్పాట్లు;
సెక్రటేరియట్ కు సంబంధించి మొత్తం గ్రౌండ్ఫ్లోర్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. 50 చదరపుటడుగుల విస్తీర్ణంలో ఉద్యోగుల కోసం చాంబర్లు సిద్ధం చేశారు. వారికి ఇబ్బందులు లేకుండా ఫ్యాన్స్, ఏసీ, వెలుతురు ఏర్పాట్లు చేశారు. అలాగే, ఉన్నతాధికారులకు ప్రత్యేక ఛాంబర్లు నిర్మించారు. ప్రతి శాఖ అధికారి చాంబర్కు పక్కనే కంప్యూటర్ ఆపరేటర్ల గదులు నిర్మించారు. ఇతర సెక్షన్ ఉద్యోగులకు హాల్లో చాంబర్లు ఏర్పాటు చేశారు. సచివాలయానికి నిరంతరం విద్యుత సరఫరా అయ్యేలా ప్రాంగణంలోనే పవర్ షిఫ్టింగ్ స్టేషన్ను నిర్మించారు. విజయవాడ నుంచి ఇక్కడికి చేరుకునే ఉద్యోగుల కోసం ఆర్టీసీ ప్రత్యేకంగా ఐదు మెట్రో బస్సులను ఏర్పాటు చేసింది. ఇవి తాడేపల్లి, మందడం మీదుగా సచివాలయానికి చేరుకుంటాయి. సాయంత్రం తిరిగి 5.15 గంటలకు తిరిగి విజయవాడకు బయల్దేరతాయి.
కాగా.. ఇప్పటికే హెచ్ఓడీ 124 కార్యాలయాల్లో 64 ఇప్పటికే తరలిపోయాయి. మిగతా వాటిని కూడా త్వరలో తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మొత్తానికి జూలై 6వ తేదీ కల్లా మిగతా శాఖల ఉద్యోగులు కూడా తమ కార్యాలయాలకు చేరనున్నారు. రోడ్ల విషయంలో తలెత్తిన ఇబ్బందులను వారం రోజుల్లోగా పరిష్కరిస్తామని అధికారులు చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more