ఆ యువతి వేదన వర్ణనాతీతం... మృగాళ్లను ఏం చేయలేమా? | girl brutally attacked boys over rejecting love in tirupathi

Girl brutally attacked boys over rejecting love in tirupathi

girl brutally attacked boys in tirupathi, rejecting love boys attacked on girl, boys accident girl for rejecting love, tirupathi girl attacked by lovers, ప్రేమించలేదని బైక్ తో గుద్దారు, వెన్నెముక దెబ్బతిని మంచానికే పరిమితమైంది, ప్రేమోన్మాదుల దాడిలో తిరుపతి యువతి, చంద్రిక దాడిలో, తాజా వార్తలు, తిరుపతి యువతి చంద్రిక, tirupathi girl chandrika attacked, chandrika attacked

Two Youth brutally attacked a girl over rejecting their love in Tirupati. It is reported that 2 Boys on their bike Wantedly created an accident scene to kill the kill, but fortunately she was escaped from the accident and filed a case against the 2 boys.

ITEMVIDEOS: ఆ యువతి వేదన వర్ణనాతీతం... మృగాళ్లను ఏం చేయలేమా?

Posted: 06/29/2016 01:27 PM IST
Girl brutally attacked boys over rejecting love in tirupathi

బలవంతంగా ప్రేమించమని భౌతిక దాడులకు దిగే మృగాళ్లను ఏం చేయలేమా? ఆ ప్రేమోన్మాదుల దాడుల్లో విగతజీవులుగా, క్షతగాత్రులుగా మారుతున్న అబలల భవిష్యత్తు ఏంటి? తిరుపతి లో తాజాగా చోటుచేసుకున్న ఉదంతంలో రాక్షసులు ఎవరో తెలిసీ కూడా పోలీసులు కిక్కురుమనకుండా ఉండటం ఆ అమ్మాయిపై జరిగిన ఘోరం కంటే మరీ దారుణంగా ఉంది. రూట్ మార్చి ఏకంగా ప్రాణాలనే తీయాలని ప్లాన్ వేస్తే దానిపై ఎవరూ నోరు మెదపకపోవటం శోచనీయం.

లక్ష్మీ చంద్రిక బెంగళూరులో ఫ్యాషన్ టెక్నాలజీ చేస్తోంది. కాలేజీలో ఉండగా నవీన్ అనే తోటి విద్యార్థి ప్రేమించాలంటూ వేధించాడు. అప్పుడు ఆ యువతి గట్టిగా మందలించడంతో వెనక్కి తగ్గాడు. కానీ, ఆ పగ మనసులోనే పెట్టుకున్నాడు. ఆమెపై హత్యాయత్నం చేయబోయాడు. కానీ, ఆమె అప్పుడు తప్పించుకుంది. దీంతో భీతిల్లిపోయిన ఆమెను తల్లిదండ్రులు బెంగళూరుకు పంపించి వేశారు. మధ్యలో ఇంటికి వస్తున్న ఆమెపై మరోకడి కన్ను పడింది. చంద్రికకు యశ్వంత్ అనే మరో యువకుడి నుంచి లవ్ ప్రపోజల్ వచ్చింది. అతన్ని కూడా ఆమె తిరస్కరించింది. దీంతో నవీన్, యశ్వంత్ ఇద్దరు ఫ్రెండ్స్ గా మారారు. ఎలాగైనా చంద్రికను మట్టుపెట్టాలని పక్కా ప్లాన్ వేసుకున్నారు.

సెలవులపై వచ్చిన ఆమెను జాగ్రత్తగా గమనించారు. జూన్ 1న తన స్నేహితురాలి స్కూటీపై వెళ్తున్న ఆమెను ఆ రెండు మృగాలు దాడి చేశాయి. అతిగా మద్యం సేవించి బైక్ తో యువతులు ఇద్దరు వెళ్తున్న బండిని గుద్దారు. దీంతో కిందపడిపోయిన యువతులిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు నిందితులిద్దరూ పట్టుకునేందుకు యత్నించినా వీలుకాలేదు. చంద్రికను బూతులు తిడుతూ చంపేస్తామని హెచ్చరిస్తూ పారిపోయారు. వెంటనే యువతులిద్దరినీ రుయా ఆస్పత్రికి తరలించారు. స్నేహితురాలు పరిస్థితి బాగానే ఉన్నప్పటికీ ఆమె వెన్నెముకకు తీవ్ర గాయాలు అయ్యాయి. అయినా వదలని వాళ్లిద్దరూ ఆమెను ఆస్పత్రికి వచ్చి మరీ బెదిరించారు. ఫేస్ బుక్ లో, ఫోన్లో బూతు మేసేజ్ లు పంపారు.

దీంతో తన కూతురి పట్ల ఆ దుర్మార్గులు చేస్తున్న పనికి ఆ తండ్రి రగిలిపోయాడు. మరుసటి రోజే అలిపిరి స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దాదాపు ఘటన జరిగి నెలరోజులు కావస్తున్న పోలీసులు ఇంతవరకు చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. అయితే మీడియాకు తెలిస్తే ఎక్కడ చిక్కుల్లో పడతామనే ఘటనను వెలుగులోకి రానీయకుండా చేసినట్లు అర్థమౌతోంది. మరోవైపు వారిద్దరి 6వ తేదీనే అదుపులోకి తీసుకున్నామని, నిర్భయ కేసు కూడా పెట్టామని పోలీసులు చెబుతున్నారు.

ఇందులో నిజనిజాలు ఎంత ఉందో తెలీకపోయినా వారు చేసిన పనికి యువతి వెన్నెముక దెబ్బతినటంతో ఇప్పుడు మంచానికే పరిమితమైంది. తమ కూతురి స్థితిని చూసి ఆ తల్లిదండ్రులు కుమిలిపోతున్నారు. చంద్రిక వ్యవహారంలో ప్రజా ప్రతినిధులు జోక్యం చేసకోవాలని మహిళ సంఘాలు డిమాండ్ చేస్తూ రోడెక్కాయి.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tirupathi girl  chandrika  love  attack  

Other Articles