అచ్చంగా సినీపక్కీలో మహారాష్ట్రలో భారీ దోపిడి జరిగింది. పోలీసులకు సవాల్ విసిరిన దోపిడి దోంగలు.. క్షణాల్లో తమ పని ముగించుకుని వెళ్తూ వెళ్తూ.. తాము దొరకకుండా సాక్ష్యాలను కూడా ఎత్తుకెళ్లారు. మహారాష్ట్రలోని థానేలో ఈ భారీ దోపిడి జరిగింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 9.5 కోట్ల రూపాయలను దొపీడీ దోంగలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన స్థానికంగా పెను సంచలనం రేకెత్తించగా, నిందితుల కోసం పోలీసులు థానే పరిసర ప్రాంతాలలో చెక్ పోస్టులను కూడా ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు.
పోలీసులు వెలువరించిన వివరాల ప్రకారం.. పశ్చిమ థానేలోని తీన్హాత్నాకా ప్రాంతంలో ఉన్న చెక్ మేట్ క్యాష్ మేనేజ్ మెంట్ సర్వీసెస్ సంస్థను దొంగలు టార్గెట్ చేశారు. పలు బ్యాంకులకు చెందిన ఏటీయంలలో ఈ సంస్థ డబ్బును ఏర్పాటు చేస్తుంది, దీనిని గమనించిన దోపిడి దోంగలు ముందుగా వేసుకున్న పథకం ప్రకారం సంస్థపై దాడి చేసి సుమారు రూ.9.5 కోట్లు దోచుకుని దుండగులు పరారయ్యారు. తమను పోలీసులు గుర్తించకుండా ఉండేందుకు సీసీటీవీ కెమెరాలను కూడా వారు దొంగిలించుకుపోయారు.
కంపెనీలో భారీ మొత్తంలో డబ్బులు ఉంటాయని తెలుసుకున్న కొందరు పథకం ప్రకారం దోపిడికి తెగబడ్డారు. సెక్యూరిటీ గార్డును ఆయుధాలతో బెదిరించి 8 మంది లోపలికి చొరబడ్డారు. అనంతరం సుమారు రూ.9.5 కోట్ల నగదును దోచుకుని పారిపోయినట్లు సమాచారం. డబ్బులతో పాటు దొంగలు సీసీటీవీ కెమెరాలు, రికార్డు అయ్యే డీవీఆర్ను కూడా దొంగిలించుకుని పోయారని పోలీసులు తెలిపారు.
అయితే ఇది సంస్థ గురించి పూర్తి సమాచారం తెలిసిన వారి పనేనని భావిస్తున్న పోలీసులు.. సంస్థలోకి చోరబడిన దొంగలందరి చేతుల్లోనూ ఆయుధాలు వున్నాయని తెలిపారు. అయితే ఇది ఇంటి దోంగల పనా..? లేక ఇంటి గుట్టు బయటకు తెలియడంతో జరిగిన పనా అన్నది పోలీసుల దర్యాప్తులోనే తెలియాలి. కాగా కేసును సాధ్యమైనంత త్వరగా చేధిస్తామని పోలీసులు చెబుతున్నారు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more