వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన బీజేపి నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామిపై సోంత పార్టీకి చెందిన నేతలు గుర్రుగా వున్నారు. నిత్యం తన వివాదాస్పద వ్యాఖ్యలతో విపక్షాలను ముప్పు తిప్పలు పెడుతున్న ఆయన ట్విట్టర్ లో సొంత పార్టీ నేతలను, కేంద్ర మంత్రులను టార్గెట్ చేస్తూ పెట్టిన కామెంట్ల నేపథ్యంలో ఆయనపై సొంత పార్టీ నేతలే మండిపడుతున్నారని సమాచారం. పార్టీ పెద్దలకు కూడా ఆయన చికాకు తెప్పించేలా వ్యాఖ్యలు చేస్తున్నారని అనిపిస్తున్నట్లుగా వున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఆర్ఎస్ఎస్ కూడా స్వామి వ్యాఖ్యలను సమర్థించదని బీజేపీ నేతలు చెప్పారు. కేంద్ర మంత్రులు, బ్యూరోక్రాట్లపై స్వామి చేసే వ్యక్తిగత ఆరోపణలను ఆర్ఎస్ఎస్ ఆమోదించదని తెలిపారు. ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ను పదవి నుంచి తొలగించాలని స్వామి డిమాండ్ చేయగా, బీజేపీ తప్పుబట్టిన సంగతి తెలిసిందే. స్వామిది వ్యక్తిగత అభిప్రాయమని, ఆయన అభిప్రాయాలతో ఏకీభవించడంలేదని బీజేపీ స్పష్టం చేసింది. అరవింద్ పై ప్రభుత్వానికి పూర్తి విశ్వాసం ఉందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు.
ఇక తాజాగా ఇవాళ ఉదయం విదేశీ పర్యటనలో ఉన్న మంత్రులు సంప్రదాయ, లేదా మన దేశానికే చెందిన ఆధునిక దుస్తులు ధరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. అంతేకాదు మన అమాత్యులు టై, కోట్ ధరిస్తే వెయిటర్లలా కనిపిస్తారంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. గత కొంతకాలంగా ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్, ఆర్ధిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం తాజాగా ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తి కాంతాదాస్ లను లక్ష్యంగా చేసుకుని సుబ్రమణ్యం స్వామి విమర్శలు చేశారు, స్వామి తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండటంతో బీజేపీ పెద్దలకు కోపం తెప్పించినట్టు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more