తెలంగాణను మొండిచెయ్యి చూపిస్తూ, ఆంధ్రకు అడ్డగోలుగా కేంద్రం నిధులు మంజూరు చేస్తోంది. ఇది గత కొద్దిరోజులుగా సీఎం కేసీఆర్ అండ్ కో చేస్తున్న ఆరోపణ. అయితే కనీసం అవసరమైన మేర నిధులు కూడా ఇవ్వడం లేదంటూ స్వయానా కేసీఆర్ చేస్తున్న వాదనలో పస లేదని తేలిపోయింది. అయితే కేంద్రం ఇచ్చిన నిధులను వినియోగించే విషయంపై తెలుగు రాష్ట్రాలు అసలు దృష్టి సారించడం లేదంటూ కేంద్రం చెబుతోంది. ఇచ్చిన నిధులను సరిగ్గా వినియోగించకుండా ఇప్పుడు తమకు మరిన్ని నిధులు కావాలని లేఖలు రాయటం కరెక్ట్ కాదంటోంది.
కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నద్దా ఇటీవలె తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఓ లేఖ రాశారు. ‘ముందు అసలు ఇచ్చిన నిధులను సరిగ్గా ఖర్చు చేయండి మహాప్రభో' అంటూ అందులో పేర్కొన్నారు. ఇచ్చిన నిధులను ముందుగా ఖర్చు పెట్టండి, ఆ తర్వాత మరిన్ని నిధులు గురించి అడగండి అంటూ సూచించారు. అసలు విషయం ఏంటంటే... జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్ హెచ్ఎం) కింద ఏటా తెలంగాణకు కేంద్రం రూ.1,000 కోట్లు విడుదల కేటాయిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో 60 శాతం కేంద్ర నిధులు, 40 శాతం రాష్ట్ర వాటా ఉంటుంది.
అయితే ఈ పథకం అమలుపై గత రెండేళ్లుగా తెలంగాణ సర్కారు ఆసక్తి చూపడం లేదు. అంతేకాదు గతేడాది కేంద్రం విడుదల చేసిన నిధుల్లో ఇంకా రూ.438 కోట్లు అలాగే మిగిలే ఉన్నాయంట. వీటిలో రూ.143 కోట్లను ఆర్థిక శాఖ నిలిపివేయటం గమనార్హం. ఇదే విషయాన్ని నద్దా ప్రస్తావిస్తూ ముందు ఇచ్చిన నిధులను సరిగ్గా సద్వినియోగపరుచుకోడంటూ పరోక్షంగా కేసీఆర్ కు పంచ్ వేశారు. ఈ లేఖ వ్యవహారాన్ని గోప్యంగా ఉంచాలని ప్రయత్నించినప్పటికీ అధికారుల అత్యుత్సాహంతో తో విషయం బయటికి వచ్చింది.
భాస్కర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more