కాపు కులస్థులను బిసిలలోకి చేర్చాలని డిమాండ్ చేస్తూ.. కాపు హక్కుల ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన అమరణ దీక్షను తొమ్మిదవ రోజుకు చేరుకుంది. దీంతో ఆయన అరోగ్యం పూర్తిగా క్షీణించింది. ఆయన ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో వున్నారు. ఏ క్షణంలో ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితుల్లోకి జారుకున్నారు.. బుధవారం ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించి, రక్త నమూనాలను సేకరించేలా వైద్యులకు సహకరించిన ముద్రగడ నిన్న ఆ మాత్రం కూడా సహకరించలేదు. కాపు వర్గానికి చెందిన టీడీపీ మంత్రలు చేస్తున్న వ్యాఖ్యలను అయనను కించపర్చేలా వున్నాయని భావించిన ఆయన మళ్లీ వైద్యులకు సహకరించడం లేదు. దీంతో ఆయన పరిస్థితి మరింతగా క్షీణిస్తుందని వైద్యులు అంటున్నారు. తొమ్మిదవ రోజు మంచినీళ్లు కూడా తీసుకోకుండా అమరణ దీక్ష చేస్తున్న ముద్రగడ శరీరంలో కీటోన్స్ సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు.
దీంతో ఆయన అరోగ్య పరిస్థితి మళ్లీ ప్రమాద స్థాయికి చేరుకుంటుందని.. ఈ నేపథ్యంలో అయనకు ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వక తప్పనిసరి పరిస్థితి నెలకోందని వైద్యులు చెబుతున్నారు. ఆయన బీపి షుగర్ లెవల్స్ కూడా కంట్రోల్ లో లేవని తెలుస్తుంది. ఇంకా ముద్రగడ దీక్షను చేపట్టడం ఆయన అరోగ్యరిత్యా మంచిది కాదని కూడా వైద్యులు హెచ్చరిస్తున్నారు. చంద్రబాబు సర్కార్ ముద్రగడ దీక్షపై నోటితో సానుభూతిని వ్యక్తం చేస్తూనే.. నోసటితో వక్కిరించే విధంగా చర్యలు చేపట్టడంతో ముద్రగడ కలత చెందారని అందుచేతనే ఆయన వైద్యానికి సహకరించడం లేదని వార్తలు వినబడుతున్నాయి.
మరోవైపు ముద్రగడ పద్మనాభం ఆరోగ్య పరిస్థితి విషమిస్తున్నా.. ఆయన ఆరోగ్యంతో చంద్రబాబు సర్కారు చెలగాటమాడుతోందని కాపు నేతలు విమర్శిస్తున్నారు. ఓవైపు అధికారులను పంపి, చర్చలంటూ వైద్యానికి ఒప్పించి, రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రిలో వైద్య సేవలు అందిస్తూనే మరోవైపు మంత్రులతో ఎగతాళి వ్యాఖ్యలు చేయించి ముద్రగడ వైద్యానికి నిరాకరించే స్థితికి కారణమైంది. ఇప్పుడాయన వైద్యాన్ని పూర్తిగా నిరాకరించడంతో ఏ క్షణాన ఏమి జరుగుతుందో చెప్పలేమని వైద్యులంటున్నారు.
ముద్రగడ ఆరోగ్యం విషమించిందనే సమాచారం బయటకు రావడంతో గురువారం రాష్ట్రవ్యాప్తంగా కాపు ఉద్యమం మరింత ఎగసింది .గోదావరి జిల్లాలతో పాటు పలు జిల్లాల్లో రాస్తారోకోలు, ధర్నాలు, యువకుల బైక్ ర్యాలీలు జరిగారుు. తుని ఘటనలో అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలనే డిమాండ్తో ఆమరణ దీక్ష చేస్తున్న ముద్రగడ ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ముద్రగడ వైద్య నివేదికలు అంతా సవ్యంగా వున్నాయని స్పష్టం చేయడం పట్ల మంత్రులు అవహేళన చేసేలా వ్యాఖ్యానించడాన్ని కాపు నేతలు తిప్పకోట్టారు.
ముద్రగడ అరోగ్యంపై హైదరాబాద్ అస్పత్రుల వైద్యులతో పరిక్షలు చేయించి నివేదికలు బహిర్గతం చేస్తే మంత్రుల మాటల్లో నిజమెంతో తెలిపోతుందని పేర్కోన్నారు. ముద్రగడకు ఏదైనా హాని జరిగితే.. టీడీపీ ఇక రాష్ట్రంలో కనుమరుగవ్వక తప్పదని కాపు నేతలు హెచ్చరిస్తున్నారు. ముద్రగడ ప్రాణాపాయ స్థితిలో వున్నారని తెలుస్తున్నా ఆయన అరోగ్యంతో ప్రభుత్వం అటటాడుతుందని విమర్శించారు. ఇచ్చిన హామీలను నేరవేర్చడానికి ఇష్టంలో పబ్బం గడుపుకునే నేతలు.. ఎన్నికల ముందు ఎలా హామీలను గుప్పించారని వారు దుయ్యబట్టారు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more