అంధ్రప్రదేశ్ లో ప్రశాంతతకు మారుపేరుగా నిలిచిన కోనసీమలో హైటెన్షన్ నెలకొంది. కాపు గర్జన సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలపై కేసు నమోదు చేసిన ప్రభుత్వం.. మళ్లీ కాపు నేతలను టార్గెట్ చేసింది. ఇటీవల కాపు గర్జన సందర్భంగా జరిగిన రైలు దహనం కేసులో నిందితులుగా భావించిన పది మంది కాపు నేతలను అదుపులోకి తీసుకుని అమలాపురం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో విషయం దవాణంలా వ్యాపించడంతో కాపు నేతలు, కార్యకర్తలు, కులస్థులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుంటున్నారు.
అమలాపురం పోలీస్ స్టేషన్ కు చేరుకుంటున్న కాపు నేతలు అడ్డుకునేందుకు స్థానికంగా 14 ప్రాంతాలలో పోలీసులు పికెట్ లను ఏర్పాటు చేశారు. అయినా పోలీసులను తప్పించుకుని, కాపు సంఘాల నేతలు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ కు చేరుకుంటున్నారు. దీంతో నిత్యం ప్రశాంతంగా కనిపించే అమలాపురంలో ఒక్కసారిగా మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకోంది. కాపు గర్జన సభ తరువాత స్తానిక రైల్వే స్టేషన్ వద్ద నిలిపివున్న రత్నాచల్ ఎక్స్ ప్రెస్ రైలుకు కొందరు అగంతకులు నిప్పుపెట్టారు. అయితే కాపు కార్యకర్తలే నిప్పు పెట్టారని అప్పట్లో ప్రభుత్వం, మంత్రులు అరోపించారు. దీంతో ఈ కేసులో అరెస్టులకు పోలీసులు పూనుకోవడంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది
అరెస్టుల సమాచారం అందుకున్న కాపు సంఘం నేత ముద్రగడ పద్మనాభం.. అమలాపురం వన్ టౌన్ పొలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. అరెస్టు చేసిన కాపు కార్యకర్తలను బేషరుతా వదిలిపెట్టాలని డిమాండ్ చేశారు. కాపు గర్జన సభ నిర్వహించిన నేపథ్యంలో సభకు కర్త, కర్మ, క్రియ అంతా తానేనని, తననే ముందుగా అరెస్టు చేయాలని స్టేషన్ ముందు భీష్మించుకుని కూర్చున్నారు. ముందుగా వేదికమీద వున్న నేతలను అరెస్టు చేయండి అ తరువాత కార్యకర్తల జోలికి వెళ్లండని ఆయన సూచించారు.
ఎన్నికలకు ముందు టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా చంద్రబాబు సర్కార్ నేరవేర్చడం లేదని ఉవ్వెత్తున్న నిర్వహించిన కాపు గర్జన సభకు లక్షాలాది మంది కాపులు తరలివచ్చారని, అయితే రత్నాచల్ ఎక్స్ ప్రెస్ ను తగులబెట్టిన వారెవరో సమయం వచ్చినప్పుడు తాను బయటపెడతానని చెప్పారు. తనను కాపు గర్జన పెట్టమని అనాడు ప్రోత్సహించిన వారే ఇవాళ చంద్రబాబు అండతో తనను తిడుతున్నారని పద్మనాభం అన్నారు. అమాయక కాపు యువకులను విడుదల చేసే వరకు స్టేషన్ లోనే బైఠాయిస్తానని ముద్రగడ హెచ్చరించారు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more