ఖాళీ కానున్న 6 రాజ్య సభ స్థానాలకు జరుగబోయే ఎన్నికల్లో పోలింగ్ అవసరం లేకుండానే క్రతువు ముగిసింది. మొత్తం 57 స్థానాలకు నోటిఫికేషన్ జారీ చేయగా, అందులో ఏపీకి నాలుగు, తెలంగాణకు రెండు సీట్లు ఉన్నాయి. ఎమ్మెల్యేల సంఖ్యా బలం ఆధారంగా అధికార టీడీపీకి మూడు అనుకున్నప్పటికీ చివరి నిమిషంలో నాలుగో స్థానంకి కూడా పోటీచేయాలని బావించింది. అయితే సరిపడా బలం లేకపోవటంతో వెనక్కి తగ్గింది.ఆ స్థానం కోసం అప్పటికే విపక్ష వైసీపీ అభ్యర్థి, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఇక టీడీపీ పోటీ నుంచి తప్పుకోవటంతో విజయసాయిరెడ్డి భార్య సునందారెడ్డి చేత డమ్మీ నామినేషన్ దాఖలు చేయించారు. ఒకవేళ టీడీపీ ఏదైనా కుట్ర చేసి విజయసాయిరెడ్డి నామినేషన్ ను తిరస్కరించేలా పావులు కదిపితే అప్పుడు ఆమెను బరిలో నిలుపుతామని వైకాపా ప్రకటించింది. ఒకవేళ అలాంటిది ఏం జరగకపోతే నామినేషన్ల పరిశీలన అనంతరం, ఆమె పోటీ నుంచి విత్ డ్రా అయ్యేలా ప్లాన్ వేశారు. అధికార పక్షం టీడీపీ తరపున అభ్యర్థులుగా కేంద్ర మంత్రి సుజనా చౌదరి, మాజీ మంత్రి టీజీ వెంకటేశ్ నామినేషన్ లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. మిత్రపక్షం బీజేపీకి తరపున కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు బరిలోకి దిగారు. దీంతో మొత్తం నాలుగు సీట్లకు ఒక్కొక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో పోలింగ్ అవసరం లేకుండా ఆయా అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలిచినట్లయ్యింది.
తెలంగాణ విషయానికి వస్తే రెండు సీట్లను కూడా టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. సీనియర్లు డీ శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావులు నామినేషన్లు దాఖలు చేశారు. ప్రతిపక్ష టీ కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగాలని అనుకున్నప్పటికీ చివరి నిమిషంలో లైట్ తీస్కుంది. వీహెచ్ పోటీ చేద్దామని అనుకున్నప్పటికీ అధిష్ఠానం అందుకు అంగీకరించలేదు. దీంతో ఇక్కడ కూడా పోటీ అవసరం లేకుండా గెలుపొందినట్లయ్యింది.
భాస్కర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more