ఏ దేశానికి చెందినవాడైనా.. తమ దేశాన్ని ఎవరైనా కించపర్చే వ్యాఖ్యలు చేస్తే.. ఆయన ఎవరు.. ఏ స్థాయి అధికారంలో ఇలా వ్యాఖ్యలు చేస్తున్నాడని ఎవరూ చూడరు. తమ దేశాన్ని కించపర్చేందుకు నైతిక హక్కు ఏమిటని ప్రశ్నించారు. ఇక మరికోందరైతే అవతలి వారి స్థాయిని కూడా మరచి తిట్టేస్తుంటారు. కానీ ఈ విషయంలో చైనా వాసుల రూటు మాత్రం సపరేటు. తమ దేశాన్ని బండబూతులు తిడుతున్నా వారిపై తమ దేశంలో వున్న డిమాండ్ దృష్ట్యా ఈ మాటలు అనాల్సివస్తుంది.
చైనా తమ దేశాన్ని రేప్ చేసిందంటూ.. తమ ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసిందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఆ దేశ దూకుడుకు ఎలాగైనా తాను కళ్లెం వేస్తానని మాటలు పేలిన అమెరికన్ ప్రెసిడెంట్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్కు చైనాలో మాత్రం మంచి డిమాండ్ పెరుగుతోంది. ఆయన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం తప్పక సాధిస్తారని మాస్క్లు (ముసుగులు) తయారు చేసే ఓ చైనా కంపెనీ యజమాని బెట్టింగ్లు కాస్తున్నాడు. ట్రంప్ గెలిచే అవకాశాన్ని తాను ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించుకుంటానని చెబుతూ ఇప్పటికే ట్రంప్ ముఖంలాంటి ముసుగులు వందల్లో తయారు చేసి సిద్ధంగా ఉంచాడు.
ఒక్క ట్రంప్ వే కాకుండా హిల్లరీ, సాండర్స్ మాస్క్లు కూడా తన మాస్క్ల ఫ్యాక్టరీలో ముందుచూపుతో తయారుచేయించాడు. చైనాలోని జిజియాంగ్ ప్రావిన్నస్లోగల లాటెక్స్ ఆర్ట్, క్రాఫ్ట్స్ ఫ్యాక్టరీకి ఒక ప్రముఖ మాస్క్ల తయారీ పరిశ్రమగా పేరుంది. ఇందులో ఒసామా బిన్ లాడెన్ నుంచి స్పైడర్ మేన్ వరకు రబ్బరుతో ముసుగులు తయారు చేస్తారు. ట్రంప్, హిల్లరీల ఒక్కో మాస్క్ ధర ఐదు డాలర్లుగా నిర్ణయించారు. ఒక్కో నేతకు దాదాపు అర మిలియన్ మాస్క్లు సిద్ధం చేస్తున్నారట. అయితే, ఈ పరిశ్రమ యజమాని మాత్రం ట్రంప్ కచ్చితంగా విజయం సాధిస్తాడని, ట్రంప్ ముసుగులు వీలయినన్ని ఎక్కువగా తయారుచేయాలని కార్మికులకు చెప్పినట్లు కూడా తెలుస్తోంది.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more