తెలుగుదేశం పార్టీ యేటా చేసుకునే పండగ మహానాడు కోసం సర్వం సిద్ధమైంది. మే 27, 28, 29 మూడు రోజులపాటు జరిగే ఈ వేడుకల కోసం తిరుపతి నెహ్రూ మున్సిపల్ స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేశారు. కాగా, పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి తిరుపతిలో మహానాడు నిర్వహించడం ఇది మూడోసారి. పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలను వచ్చే అవకాశం ఉండటంతో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. దాదాపు 30 వేల మంది కూర్చునే విధంగా స్థభాస్థలిని రూపొందించారు. వేదికపై అధినేతతో పాటు కీలక నేతలు కూర్చునే విధంగా డిజైన్ చేశారు. ఏపీ, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా టీడీపీ సాంస్కృతిక విభాగం ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తోంది. ఇప్పటికే పలువురు కీలక నేతలు వేదిక వద్దకు చేరుకుని ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు.
పార్టీ జెండా ఆవిష్కరించి, వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కి నివాళులర్పించి చంద్రబాబు మహానాడును ప్రారంభిస్తారు. ఇక తొలిరోజు 7 తీర్మానాలపై చర్చించనున్నారు. ఏడాది పాలన సమీక్షతోపాటు, కొత్త పథకాల రూపకల్పన, అమరావతి తదితర అంశాలపై ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ యేడు మహానాడు టీడీపీకి చాలా ప్రత్యేకం. ఎందుకంటే నవ్యాంధ్ర ప్రత్యేక హోదా కోసం ఇప్పటికే పలుమార్లు కేంద్రానికి విజ్ణప్తి చేసిన తెలుగుదేశం ఈ మహానాడు వేదికగా ఏం మాట్లాడబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఈ అంశం గురించి చంద్రబాబు ఈ వేడుకను వేదికగా చేసుకుని కేంద్రానికి మరోసారి విజ్ణప్తి చేసే అవకాశం కూడా లేకపోలేదు.
ఇక రెండో రోజు మే 28న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించనున్నారు. ప్రత్యేకంగా స్వీట్లు, వంటకాలు తయారు చేయిస్తున్నారు. పార్టీ జాతీయ కార్యదర్వి నారా లోకేష్ ఏర్పాట్లను దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు. ఇక తెలంగాణలో మినీమహానాడుతో సరిపెట్టినప్పటికీ, తిరుపతి మహానాడులో కూడా ఆలోటును పూడ్చాలని చూస్తోంది. బాబు రెండేళ్ల పాలనపై ప్రత్యేక బుర్రకథలతో పాటు , తెలంగాణాలో టీఆర్ఎస్ వైఫల్యాలపై పార్టీని కార్యకర్తలను ఉత్తేజపరిచేలా ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాను రూపొందిస్తున్నారు. దాదాపు రెండు వందల మందికి పైగా కళకారులను ఇందుకు సిద్ధం చేస్తున్నారు. చివరి రోజు కీలకనేతల ప్రసంగాలతోపాటు, సాంస్కృతిక కార్యక్రమాలతో మహానాడు వేడుకలు ముగియనున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more